Breaking News

రాష్ట్రపతి నిలయంలో బతుకమ్మ సంబరాలు


సికింద్రాబాద్, 27 సెప్టెంబర్ 2025 : తెలంగాణ సాంస్కృతిక వారసత్వానికి ప్రతీక అయిన బతుకమ్మ పండుగ రాష్ట్రపతి నిలయం, సికింద్రాబాద్లో భక్తి, ఐశ్వర్యం, ప్రకృతి సౌందర్యాలకు వేదికై ఘనంగా నిర్వహించబడింది.

ఎయిర్ ఫోర్స్ ఫామిలీ వెల్ఫేర్ అసోసియేషన్ (AFFWA (L)), అక్షరయాన్ ఫౌండేషన్, డాక్టర్ ఎం.సి.ఆర్. మానవ వనరుల అభివృద్ధి సంస్థ (Dr MCRHRDIT), అలాగే భవన్స్ భారతీయ విద్యా భవన్, సెయింట్ ఆన్స్ కళాశాల తదితర విద్యాసంస్థల నుండి సుమారు 1,000 మంది మహిళలు పాల్గొన్నారు. రాష్ట్రపతి నిలయం సిబ్బంది తమ కుటుంబాలతో కలసి ఉత్సవాల్లో చురుకుగా పాల్గొని వేడుకలకు మరింత వైభవాన్ని చేకూర్చారు.

నెంబర్ ప్లేట్ ట్యాంపరింగ్‌కు పాల్పడితే కఠిన చర్యలు.

కళా ప్రదర్శనల్లో త్రితీయ డ్యాన్స్ స్టూడియో నిర్వహించిన సాంప్రదాయ భరతనాట్యం, అలాగే ఉదయశ్రీ డ్యాన్స్ అకాడమీ, జ్యోతిర్మయ కళాక్షేత్రం ప్రదర్శించిన ఉత్సాహభరితమైన బంజారా, గుసాడి వంటి జానపద నృత్యాలు ఆకట్టుకున్నాయి. ఈ వేడుకలో పుష్పాలంకరణ వైభవం, సాంప్రదాయ గీతాలు, నృత్యాలు, ఆచారాలు కలిసి ఆనందం, భక్తి, సాంస్కృతిక గర్వంతో నిండిన వాతావరణాన్ని సృష్టించాయి.
రాష్ట్రపతి నిలయం మేనేజర్ డాక్టర్ కె. రజనీ ప్రియ మాట్లాడుతూ, “ఈ వేడుకలు ప్రజలను దేశపు చారిత్రక, సాంస్కృతిక వారసత్వంతో అనుసంధానించడం లక్ష్యంగా భారత రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ము గారి దృష్టిని ప్రతిబింబిస్తున్నాయి అని, బతుకమ్మ పండుగను ఆతిథ్యం ఇవ్వడం ద్వారా రాష్ట్రపతి నిలయం సాంప్రదాయాల వైభవాన్ని ప్రదర్శించడమే కాకుండా, ఐక్యత, ఉత్సాహభరిత వాతావరణంలో సమాజాన్ని కలుపుతోంది” అని పేర్కొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *