Breaking News

హెడ్ కానిస్టేబుల్ బి.శ్రీనివాస్ కు ఏఎస్ఐగా పదోన్నతి.

పదోన్నతులు పోలీస్ లకు మరింత బాధ్యతను పెంచుతాయి

పదోన్నతులు జీవన శైలిని మార్చే విధంగా ఉత్సాహాన్ని కలిగిస్తాయి

ఇల్లంతకుంటా పోలీస్ స్టేషన్లో విధులు హెడ్ కానిస్టేబుల్ గా నిర్వహిస్తున్నా బి.శ్రీనివాస్ హెడ్ కానిస్టేబుల్ నుండి ఏఎస్ఐగా పదోన్నతి పొందినసందర్భంగా ఈ రోజు జిల్లా పోలీస్ కార్యాలయంలో అభినందించి శుభాకాంక్షలు తెలిపిన జిల్లా ఎస్పీ మహేష్ బి గితే.

శ్రీరామనవమి ఉత్సవాలకు 300 మంది పోలీసులతో భారీ బందోబస్తు: ఎస్పీ మహేష్ బి. గితే

పోలీస్ శాఖలో పదోన్నతులు మరింత బాధ్యతను పెంచుతాయని అన్నారు, పదోన్నతులు పొందిన పోలీస్ సిబ్బంది రెట్టింపు ఉత్సాహంతో ప్రజలకు సేవలు అందించాలని కోరారు. పోలీసు శాఖలో క్రమశిక్షణతో బాధ్యతగా విధుల పట్ల నిబద్ధతతో వ్యవహరించే ప్రతి ఒక్కరికీ తగిన గుర్తింపు,గౌరవ మర్యాదలు లభిస్తాయని ఎస్పీ తెలియజేశారు.

ఈ కార్యక్రమంలో ఇల్లంతకుంటా ఎస్.ఐ శ్రీకాంత్ పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *