గంభీరావుపేట పోలీస్ స్టేషన్ పరిధిలోని “మా” అభాగ్యుల వృద్ధాశ్రమాన్ని జిల్లా ఎస్పీ మహేష్ బి. గితే శనివారం సందర్శించి వృద్ధులతో ఆప్యాయంగా ముచ్చటించారు. వారి ఆరోగ్య పరిస్థితులు, అవసరాలను అడిగి తెలుసుకుని, వారికి అవసరమైన సహాయ సహకారాలు అందించారు.
ఈ సందర్భంగా వృద్ధాశ్రమంలో నివసిస్తున్న వృద్ధులకు పండ్లు, బియ్యం, కిరాణా సరుకులు మరియు ఇతర నిత్యావసర వస్తువులను పంపిణీ చేశారు. వృద్ధుల సంక్షేమం పట్ల సమాజంలోని ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా వ్యవహరించాలని ఎస్పీ సూచించారు.
వృద్ధులు, నిరాశ్రయులు, అనాథల సేవ చేయడం గొప్ప మానవతా ధర్మమని పేర్కొన్న ఆయన, వారికి అండగా నిలవడం ప్రతి ఒక్కరి సామాజిక బాధ్యత అని అన్నారు. అవసరమైన వారికి సేవలు అందించడంలో జిల్లా పోలీసు శాఖ ఎల్లప్పుడూ ముందుంటుందని స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో డీఎస్పీ నాగేంద్రచారి, సీఐ వెంకటేష్, ఎస్ఐ శ్రీకాంత్, వృద్ధాశ్రమ సభ్యులు పాల్గొన్నారు.
