Breaking News

వరి కొనుగోలు కేంద్రాలపై ప్రత్యేక పర్యవేక్షణ.. రైతులకు ఇబ్బందులు లేకుండా చర్యలు: జిల్లా ఎస్పీ స్నేహ మెహ్రా

వికారాబాద్ జిల్లా ఎస్పీ స్నేహ మెహ్రా జిల్లా కలెక్టర్ దీపక్ తివారీతో కలిసి కోడంగల్ సబ్ డివిజన్ పరిధిలోని పలు వరి కొనుగోలు కేంద్రాలు (PPCలు), గోదాములు మరియు రైస్ మిల్లులను సందర్శించి అక్కడి పరిస్థితులను పరిశీలించారు. ఈ సందర్భంగా బొంరాస్‌పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బొంరాస్‌పేట్ గ్రామం, బురన్‌పూర్ గ్రామంలోని పీపీसी కేంద్రాలను పరిశీలించారు. అనంతరం దౌల్తాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలోని దౌల్తాబాద్ గ్రామంలోని పీపీसी కేంద్రం, గోదాంను సందర్శించి ధాన్యం నిల్వలు, రవాణా, కొనుగోలు ప్రక్రియపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. అలాగే దుడ్యాల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని గౌరారం గ్రామంలోని రైస్ మిల్‌ను పరిశీలించి నిర్వహణ విధానాలను తెలుసుకున్నారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ దీపక్ తివారీ మాట్లాడుతూ రైతులు ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల ద్వారా తమ ధాన్యాన్ని విక్రయించే సమయంలో ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొనకుండా అన్ని శాఖల సమన్వయంతో చర్యలు చేపడుతున్నామని తెలిపారు. ధాన్యం కొనుగోలు ప్రక్రియ పారదర్శకంగా, వేగవంతంగా జరిగేలా ప్రత్యేక పర్యవేక్షణ కొనసాగుతోందన్నారు. రైతులకు అవసరమైన సౌకర్యాలు కల్పించడం, ధాన్యం తరలింపులో జాప్యం లేకుండా చూడడం, గోదాముల నిర్వహణపై సంబంధిత అధికారులకు సూచనలు జారీ చేసినట్లు వెల్లడించారు.

జిల్లా ఎస్పీ స్నేహ మెహ్రా మాట్లాడుతూ రైతులు పండించిన వరి ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాల ద్వారా సక్రమంగా కొనుగోలు చేయించేందుకు పోలీస్ శాఖ అన్ని విధాల సహకారం అందిస్తోందన్నారు. కొనుగోలు కేంద్రాల వద్ద రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా, మధ్యవర్తుల జోక్యం లేకుండా, శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా ప్రత్యేక చర్యలు చేపట్టినట్లు తెలిపారు. ధాన్యం రవాణాలో జాప్యాన్ని నివారించడం వంటి కీలక అంశాలపై ప్రత్యేక దృష్టి సారించాలని ఇప్పటికే డీఎస్పీ స్థాయి అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసినట్లు పేర్కొన్నారు.

జిల్లా పోలీస్ అధికారులతో నేర సమీక్ష సమావేశం నిర్వహించిన జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్

ఈ కార్యక్రమంలో పరిగి డీఎస్పీ శ్రీనివాస్, కోడంగల్ సీఐ శ్రీధర్ రెడ్డి, ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *