జిల్లా పరిధిలోని పలు పోలీస్ స్టేషన్లలో వివిధ సందర్భాల్లో స్వాధీనం చేసుకున్న, సీజ్ చేసిన మరియు రోడ్లపై వదిలివేయబడిన 15 ద్విచక్ర వాహనాలను జిల్లా పోలీస్ హెడ్క్వార్టర్స్కు తరలించినట్లు జిల్లా ఎస్పీ మహేష్ బి.గితే ఒక ప్రకటనలో తెలిపారు. ఆయా వాహనాల యజమానులు ఈ రోజు నుంచి ఆరు నెలల లోపు సరైన ధృవపత్రాలు సమర్పించి తమ వాహనాలను తిరిగి తీసుకువెళ్లవచ్చని పేర్కొన్నారు. వాహన యజమానులు అందుబాటులో లేని పక్షంలో వారి కుటుంబ సభ్యులు అవసరమైన పత్రాలు చూపించి వాహనాలను తీసుకువెళ్లవచ్చని తెలిపారు. నిర్ణీత గడువులోగా ఎవరూ వాహనాలను తీసుకుపోని యెడల ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఆరు నెలల అనంతరం వాహనాలను వేలం వేయనున్నట్లు ఎస్పీ స్పష్టం చేశారు. వాహన యజమానులు సంబంధిత పత్రాలతో జిల్లా పోలీస్ కార్యాలయంలోని మోటార్ వెహికల్ సెక్షన్ను సంప్రదించాలని సూచించారు. మరిన్ని వివరాల కోసం 87126 56428, 90009 10619 ఫోన్ నంబర్లను సంప్రదించాలని తెలిపారు.
