ప్రతి ఫిర్యాదును శ్రద్ధగా విన్న ఎస్పి గారు, సంబంధిత అధికారులకు తక్షణ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రజల సమస్యల పరిష్కారంలో ఆలస్యం చేయకుండా, చట్టపరమైన విధానాల ప్రకారం వేగంగా స్పందించాలని సూచించారు.
ఈ సందర్భంగా ఎస్పి గారు మాట్లాడుతూ, ప్రజలకు న్యాయం అందించడం పోలీసు శాఖ ప్రధాన బాధ్యత అని తెలిపారు. గ్రీవెన్స్ డే కార్యక్రమం ప్రజలు తమ సమస్యలను నేరుగా పోలీసులకు తెలియజేయడానికి ఒక మంచి వేదికగా ఉపయోగపడుతోందన్నారు. ప్రతి బాధితుడికి న్యాయం జరిగేలా కట్టుబడి ఉన్నామని స్పష్టం చేశారు.
అదేవిధంగా, ప్రజలు తమ సమస్యల పరిష్కారం కోసం నమ్మకంతో పోలీసు శాఖను సంప్రదించాలని, పోలీసు అధికారులు ఎప్పుడూ అందుబాటులో ఉంటారని తెలిపారు.
