Breaking News

వికారాబాద్ పట్టణంలో సమస్యల మయం: ప్రజల ఆవేదన, అధికారుల నిర్లక్ష్యం?

వికారాబాద్ పట్టణంలో రోజు రోజుకు పలు సామాజిక, మౌలిక సమస్యలు పెరుగుతున్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. సైకిళ్ల నుంచి ఆటోల వరకు చోరీలు జరుగుతున్నాయనే ప్రచారం స్థానికులను ఆందోళనకు గురిచేస్తోంది. బంగారం దొంగతనాలు, రేషన్ బియ్యం అక్రమ విక్రయాలు కూడా చోటుచేసుకుంటున్నాయనే విమర్శలు వినిపిస్తున్నాయి.

ఇదే సమయంలో గంజాయి సరఫరా జరుగుతోందనే ఆరోపణలు, గ్రామాల్లో విచ్చలవిడిగా బెల్ట్ షాపులు నిర్వహణ ప్రజా భద్రతపై ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి. పట్టణంలోని వైన్ షాపుల ముందు మద్యం సేవించి రోడ్లపై పడుకునే ఘటనలు తరచూ కనిపిస్తున్నాయని స్థానికులు చెబుతున్నారు.

ఒక కాలేజీలో ర్యాగింగ్ జరుగుతోందని ఆరోపణలు వస్తుండగా, ఈ అంశంపై CITU నాయకుడు మహిపాల్ ప్రెస్ నోట్ విడుదల చేసినట్లు సమాచారం. ఇది విద్యార్థుల భద్రతపై ఆందోళన కలిగిస్తోంది.

వికారాబాద్ ప్రభుత్వ కొత్త ఆసుపత్రిలో అంబులెన్స్ సౌకర్యం లేకపోవడం ప్రజలకు ఇబ్బందిగా మారింది. పట్టణంలో సీసీ కెమెరాల వ్యవస్థ సరిగా లేకపోవడం, రోడ్లపై దుమ్ము, గుంతలు తీవ్ర సమస్యగా మారాయి. మునిసిపల్ పరిధిలో చెత్త సేకరణ, వాహనాలకు డీజిల్ వినియోగంపై కూడా అనేక ఆరోపణలు వినిపిస్తున్నాయి.

ఆన్‌సైట్ ఎఫ్‌ఐఆర్‌తో బాధితుల వద్దకే పోలీసులు – మహబూబాబాద్‌లో సత్వర న్యాయానికి కొత్త సేవ

ఇదిలా ఉండగా, అసైన్మెంట్ మరియు ఈనామ్ భూములపై కొంతమంది ప్రభావశీలుల కన్ను ఉందనే విమర్శలు కూడా వస్తున్నాయి. మొత్తం మీద వికారాబాద్ అభివృద్ధి విషయంలో నిర్లక్ష్యం కొనసాగుతుందనే భావన ప్రజల్లో వ్యక్తమవుతోంది.

అయితే, ఈ సమస్యలన్నీ తెలిసినా పట్టణ ప్రజలు పెద్దగా స్పందించకపోవడం, పోరాటాలు చేయకపోవడం, ప్రశ్నించకపోవడం కూడా ఒక ప్రధాన కారణంగా కొందరు అభిప్రాయపడుతున్నారు. “మా పని మాకు సాగితే చాలు” అనే ధోరణి మారితేనే పట్టణంలో మార్పు సాధ్యమవుతుందని విశ్లేషకులు అంటున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *