బ్రేకింగ్ న్యూస్
డ్రగ్స్ రహిత సమాజమే లక్ష్యం.. గూడూరులో 1,000 మందికి పైగా విద్యార్థులతో 2K రన్హైదరాబాద్‌లో 38 కిలోల ఎండు గంజాయి స్వాధీనం.. ఐదుగురు అరెస్ట్నకిలీ నంబర్ ప్లేట్లపై హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసుల ఉక్కుపాదంనాగార్జున స్కూల్ ప్రిన్సిపల్ హత్య కేసులో సంచలన విషయాలు.. ఇద్దరు టెన్త్ క్లాస్ విద్యార్థుల అరెస్ట్‘బాబు’ అనే ఒక్క మాటతో వీడిన ప్రిన్సిపల్ హత్య మిస్టరీకేసుల సత్వర పరిష్కారం, నేరస్తులకు శిక్షలు పడేలా చేయడంలో సీడీఓల పాత్ర కీలకం: జిల్లా ఎస్పీ డా. శబరీష్, ఐపీఎస్హై-పవర్డ్ కమిటీ చర్లపల్లి ప్రిజనర్స్ అగ్రికల్చరల్ కాలనీ సందర్శనప్రజావాణిలో ప్రజల ఫిర్యాదులను స్వీకరించిన జిల్లా ఎస్పీ డి. జానకి, ఐపీఎస్నేర నియంత్రణపై ప్రత్యేక దృష్టి: పెండింగ్ కేసుల దర్యాప్తును వేగవంతం చేయాలిప్రతి పిటిషన్‌ను నిర్ణీత సమయంలో పరిశీలించి పరిష్కరించాలి: జిల్లా ఎస్పీ డా. శబరీష్డ్రగ్స్ రహిత సమాజమే లక్ష్యం.. గూడూరులో 1,000 మందికి పైగా విద్యార్థులతో 2K రన్హైదరాబాద్‌లో 38 కిలోల ఎండు గంజాయి స్వాధీనం.. ఐదుగురు అరెస్ట్నకిలీ నంబర్ ప్లేట్లపై హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసుల ఉక్కుపాదంనాగార్జున స్కూల్ ప్రిన్సిపల్ హత్య కేసులో సంచలన విషయాలు.. ఇద్దరు టెన్త్ క్లాస్ విద్యార్థుల అరెస్ట్‘బాబు’ అనే ఒక్క మాటతో వీడిన ప్రిన్సిపల్ హత్య మిస్టరీకేసుల సత్వర పరిష్కారం, నేరస్తులకు శిక్షలు పడేలా చేయడంలో సీడీఓల పాత్ర కీలకం: జిల్లా ఎస్పీ డా. శబరీష్, ఐపీఎస్హై-పవర్డ్ కమిటీ చర్లపల్లి ప్రిజనర్స్ అగ్రికల్చరల్ కాలనీ సందర్శనప్రజావాణిలో ప్రజల ఫిర్యాదులను స్వీకరించిన జిల్లా ఎస్పీ డి. జానకి, ఐపీఎస్నేర నియంత్రణపై ప్రత్యేక దృష్టి: పెండింగ్ కేసుల దర్యాప్తును వేగవంతం చేయాలిప్రతి పిటిషన్‌ను నిర్ణీత సమయంలో పరిశీలించి పరిష్కరించాలి: జిల్లా ఎస్పీ డా. శబరీష్
Telangana

విలేజ్ పోలీస్ ఆఫీసర్ వ్యవస్థను బలోపేతం చేయాలి: జిల్లా ఎస్పీ మహేష్ బి. గితే

విలేజ్ పోలీస్ ఆఫీసర్ వ్యవస్థను బలోపేతం చేయాలి: జిల్లా ఎస్పీ మహేష్ బి. గితే

ఎల్లారెడ్డిపేట: ప్రజలకు పోలీస్ సేవలు మరింత చేరువయ్యేలా విలేజ్ పోలీస్ ఆఫీసర్ (VPO) వ్యవస్థను పకడ్బందీగా అమలు చేయాలని జిల్లా ఎస్పీ మహేష్ బి. గితే సూచించారు. బుధవారం ఆయన ఎల్లారెడ్డిపేట పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేశారు.

ఈ సందర్భంగా స్టేషన్ పరిధిలో నమోదవుతున్న కేసులు, రికార్డులను సమగ్రంగా పరిశీలించిన ఎస్పీ, దర్యాప్తులో ఎటువంటి అలసత్వం ప్రదర్శించకుండా పెండింగ్ కేసులను వేగంగా పూర్తి చేయాలని ఆదేశించారు. నిందితులకు చట్టపరంగా శిక్ష పడేలా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు.

ప్రజలతో మమేకమై నేర నియంత్రణలో భాగస్వామ్యం కావాలని, గ్రామాలను తరచూ సందర్శించాలని పోలీసు సిబ్బందికి సూచించారు. ప్రజా ఫిర్యాదులపై ఆలస్యం చేయకుండా తక్షణ స్పందన ఇవ్వాలని తెలిపారు.

శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా డయల్ 100 కాల్స్‌కు వెంటనే స్పందించి సంఘటనా స్థలానికి త్వరగా చేరుకోవాలని బ్లూ కోల్ట్, పెట్రోలింగ్ సిబ్బందిని ఆదేశించారు. రౌడీ షీటర్లపై నిఘా కొనసాగించాలని సూచించారు.

డ్రగ్స్ రహిత సమాజమే లక్ష్యం.. గూడూరులో 1,000 మందికి పైగా విద్యార్థులతో 2K రన్

ఇసుక అక్రమ రవాణాను అరికట్టాలని ఎస్పీ కఠినంగా ఆదేశించారు. ఈ సందర్భంగా పదిర వద్ద ఉన్న ఇసుక రీచ్‌ను తనిఖీ చేసి తవ్వకాల విధానం, రవాణా అనుమతులు, రికార్డులను పరిశీలించారు. అక్రమంగా ఇసుక రవాణా లేదా నిల్వలు ఉంటే కేసులు నమోదు చేసి వాహనాలను సీజ్ చేస్తామని హెచ్చరించారు.

నేరాల నియంత్రణకు సీసీ కెమెరాలు ఎంతో అవసరమని పేర్కొన్న ఎస్పీ, గ్రామాలు మరియు వ్యాపార సంస్థల్లో విస్తృతంగా వాటి ఏర్పాటుకు కృషి చేయాలని సూచించారు.

ఈ తనిఖీలో ఎస్పీ వెంట ఎస్‌ఐ రాహుల్ రెడ్డి పాల్గొన్నారు.