Breaking News

హైదరాబాద్‌లో బైక్ స్టంట్లతో భయాందోళన సృష్టించిన ఇద్దరు యువకుల అరెస్ట్

హైదరాబాద్, మార్చి 25: నగరంలోని లుంబిని పార్కు మరియు తెలంగాణ సెక్రటేరియట్ పరిసర ప్రాంతాల్లో ప్రమాదకర బైక్ స్టంట్లు చేస్తూ ప్రజలను భయభ్రాంతులకు గురిచేసిన ఇద్దరు యువకులను సైఫాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. సోషల్ మీడియాలో రీల్స్ కోసం బహిరంగ రహదారులపై నిర్లక్ష్యంగా మోటార్ సైకిళ్లపై స్టంట్లు చేస్తూ ఇతర వాహనదారుల ప్రాణాలకు ముప్పు కలిగించిన ఘటన వెలుగులోకి వచ్చింది.

అరెస్టు చేయబడిన నిందితులు మొహమ్మద్ అఖీల్ (19), వృత్తి కొరియర్ బాయ్, ముషీరాబాద్ భోలక్‌పూర్ నివాసి కాగా, మొహమ్మద్ అతీక్ (22), ప్రైవేట్ ఉద్యోగి, నాంపల్లి అఘాపురా నివాసి. వీరు సోషల్ మీడియాలో ప్రాచుర్యం పొందేందుకు బాధ్యతారహితంగా స్టంట్లు చేస్తూ ప్రజలకు తీవ్ర ఇబ్బందులు కలిగించడంతో పాటు ప్రమాదాలకు కారణమయ్యేలా వ్యవహరించినట్లు పోలీసులు తెలిపారు.

విశ్వసనీయ సమాచారం మరియు నిఘా ఆధారంగా సైఫాబాద్ పోలీసులు వీరిని అదుపులోకి తీసుకుని, నేరానికి ఉపయోగించిన బైక్‌లు మరియు వీడియోలు చిత్రీకరించిన మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం నిందితులను రిమాండ్‌కు తరలించారు.

వార్షిక తనిఖీల్లో భాగంగా సంగారెడ్డి జిల్లా పోలీస్ స్టేషన్లను సందర్శించిన డీఐజీ ఎల్.ఎస్. చౌహాన్

ఈ కేసు సైఫాబాద్ పోలీస్ స్టేషన్ S.H.O ఎ. సీతయ్య పర్యవేక్షణలో, అన్వేషణాధికారి వి. పరమేశ్వరి ఆధ్వర్యంలో పోలీసులు ఎల్. సంపత్ కుమార్, బి. విజయ్ కుమార్, జె. లింగస్వామి మరియు ఎస్. మహేష్ పాల్గొని అరెస్టు చేశారు. ప్రజా భద్రతకు విఘాతం కలిగించే విధంగా రోడ్లపై ప్రమాదకర స్టంట్లు చేసే వారిపై కఠిన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *