బ్రేకింగ్ న్యూస్
సంగారెడ్డి జిల్లాలో ఒకే రాత్రి రెండు ఘోర రోడ్డు ప్రమాదాలు.. 8 మంది మృతిరిటైర్డ్‌ ఐపీఎస్‌ అధికారి భార్య హత్య కేసులో కీలక పరిణామం.. నేపాల్‌ ముఠా సభ్యుడిపై పీడీ యాక్ట్‌ ప్రయోగంహెచ్-సిటీ పనులతో కేబీఆర్ పార్క్ చుట్టూ వన్‌వే ట్రాఫిక్ విధానంనాణ్యమైన దర్యాప్తుతో కేసులను వేగంగా పరిష్కరించాలి: జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్మిడ్ మ్యానేర్ బ్యాక్ వాటర్‌లో పర్యాటకుల భద్రతకు పటిష్ట చర్యలుచోరీ, పోగొట్టుకున్న మొబైల్ ఫోన్ల కొనుగోలు, విక్రయాలపై కఠిన చర్యలుహైదరాబాద్‌లో వాసవి కాలేజ్‌ విద్యార్థులకు ‘అరైవ్ అలైవ్’ రోడ్డు భద్రతా అవగాహననల్లగొండలో వరుస పగటి చోరీలకు చెక్.. అంతర్రాష్ట్ర దొంగ అరెస్ట్బంజారాహిల్స్‌ అత్యాచారం కేసులో నిందితుడికి 10 ఏళ్ల కఠిన కారాగార శిక్షగంజాయి వ్యసన నిర్మూలనే లక్ష్యం: బాధితులకు మెరుగైన వైద్యం అందించాలిసంగారెడ్డి జిల్లాలో ఒకే రాత్రి రెండు ఘోర రోడ్డు ప్రమాదాలు.. 8 మంది మృతిరిటైర్డ్‌ ఐపీఎస్‌ అధికారి భార్య హత్య కేసులో కీలక పరిణామం.. నేపాల్‌ ముఠా సభ్యుడిపై పీడీ యాక్ట్‌ ప్రయోగంహెచ్-సిటీ పనులతో కేబీఆర్ పార్క్ చుట్టూ వన్‌వే ట్రాఫిక్ విధానంనాణ్యమైన దర్యాప్తుతో కేసులను వేగంగా పరిష్కరించాలి: జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్మిడ్ మ్యానేర్ బ్యాక్ వాటర్‌లో పర్యాటకుల భద్రతకు పటిష్ట చర్యలుచోరీ, పోగొట్టుకున్న మొబైల్ ఫోన్ల కొనుగోలు, విక్రయాలపై కఠిన చర్యలుహైదరాబాద్‌లో వాసవి కాలేజ్‌ విద్యార్థులకు ‘అరైవ్ అలైవ్’ రోడ్డు భద్రతా అవగాహననల్లగొండలో వరుస పగటి చోరీలకు చెక్.. అంతర్రాష్ట్ర దొంగ అరెస్ట్బంజారాహిల్స్‌ అత్యాచారం కేసులో నిందితుడికి 10 ఏళ్ల కఠిన కారాగార శిక్షగంజాయి వ్యసన నిర్మూలనే లక్ష్యం: బాధితులకు మెరుగైన వైద్యం అందించాలి
Hyderabad

పుకార్లు నమ్మొద్దు.. ఇంధన కొరత లేదు.

పుకార్లు నమ్మొద్దు.. ఇంధన కొరత లేదు.

హైదరాబాద్, మార్చి 25: నగరంలో ఇంధన కొరత ఉందంటూ సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారాలు పూర్తిగా అవాస్తవమని వీసీ సజ్జనర్ స్పష్టం చేశారు. నగరంలో దాదాపు 60 రోజులకు సరిపడా పెట్రోల్, డీజిల్ నిల్వలు ఉన్నాయని, ప్రజలు ఎలాంటి భయాందోళనలకు గురికావాల్సిన అవసరం లేదని ఆయన తెలిపారు.

ఇంధన సరఫరాపై ఏర్పడిన అపోహల నేపథ్యంలో అధికారులతో కలిసి సమీక్ష నిర్వహించిన సీపీ, ఆయిల్ కంపెనీలతో నిరంతరం సంప్రదింపులు కొనసాగుతున్నాయని చెప్పారు. నగరవ్యాప్తంగా ఇంధన సరఫరా నిరాటంకంగా కొనసాగుతోందని వెల్లడించారు. అయితే, పుకార్ల ప్రభావంతో ప్రజలు ఒకేసారి పెట్రోల్ బంకులకు చేరుకొని వాహనాలకు ఫుల్ ట్యాంకులు చేయించుకోవడం వల్ల కొన్నిచోట్ల తాత్కాలికంగా “నో స్టాక్” బోర్డులు కనిపిస్తున్నాయని, దీనిని కొరతగా భావించవద్దని కోరారు.

తప్పుడు ప్రచారాల ప్రభావంతో ఇంధన వినియోగం ఒక్కరోజులోనే గణనీయంగా పెరిగినట్లు అధికారులు తెలిపారు. ఈ నెల 22న 3,024 కిలోలీటర్ల ఇంధనం అమ్ముడవగా, 23న అది 6,400 కిలోలీటర్లకు పెరిగిందని పేర్కొన్నారు. ప్రజలు భయాందోళనలకు గురికాకుండా సాధారణంగా ఇంధనం వినియోగించాలని సూచించారు.

రిటైర్డ్‌ ఐపీఎస్‌ అధికారి భార్య హత్య కేసులో కీలక పరిణామం.. నేపాల్‌ ముఠా సభ్యుడిపై పీడీ యాక్ట్‌ ప్రయోగం

నిబంధనలకు విరుద్ధంగా బాటిళ్లు, డబ్బాల్లో లూజ్ పెట్రోల్ లేదా డీజిల్ విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సోషల్ మీడియాలో తప్పుడు వార్తలు ప్రచారం చేసే వారిపై నిఘా ఉంచినట్లు తెలిపారు.

ఈ సందర్భంగా హరిచందన మాట్లాడుతూ, ఆయిల్ సంస్థలు మరియు సివిల్ సప్లై అధికారులతో సమన్వయం చేస్తూ పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తున్నామని తెలిపారు. ప్రజల సౌకర్యార్థం ప్రత్యేక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ప్రస్తుతం నగరంలోని ఎక్కువ భాగం పెట్రోల్ బంకుల్లో సరఫరా సజావుగా కొనసాగుతోందని, ప్రజలు అనవసర ఆందోళనతో బంకుల వద్ద రద్దీ పెంచవద్దని విజ్ఞప్తి చేశారు.