తెలంగాణ కొత్త డీజీపీ ఎంపికకు యూపీఎస్సీ కసరత్తు


తెలంగాణ తదుపరి డీజీపీ ఎంపిక ప్రక్రియలో భాగంగా యూపీఎస్సీ ముగ్గురు ఐపీఎస్ అధికారుల పేర్లను రాష్ట్ర ప్రభుత్వానికి పంపింది. సీవీ ఆనంద్ ఐపీఎస్ ,సౌమ్య మిశ్రా ఐపీఎస్ , ప్రభాకర్ ఆప్టే ఐపీఎస్, లతో కూడిన ఈ జాబితా నుండి ఒకరిని ప్రభుత్వం ఖరారు చేయనుంది. ప్రస్తుత డీజీపీ శివధర్ రెడ్డి వచ్చే నెలలో పదవీ విరమణ చేయనున్న నేపథ్యంలో ఈ నియామకం ప్రాధాన్యత సంతరించుకుంది. త్వరలోనే వీరిలో ఒకరిని కొత్త పోలీస్ బాస్ గా నియమిస్తూ ప్రభుత్వం అధికారిక ఉత్తర్వులు జారీ చేయనుంది. ఈ ముగ్గురిలో రేసులో ఎవరు నిలుస్తారనేది ఆసక్తికరంగా మారింది.
