Breaking News

జిల్లా పోలీస్ కార్యాలయంలో పని చేస్తూ బదిలీపై వెళ్తున్న అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్‌ (ఏ.ఓ) శ్రీనివాస్‌కు ఘన వీడ్కోలు

జిల్లా పోలీస్ కార్యాలయంలో పని చేస్తూ బదిలీపై వెళ్తున్న అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్‌ (ఏ.ఓ) శ్రీనివాస్‌కు ఘన వీడ్కోలు

నల్గొండ జిల్లా పోలీస్ కార్యాలయంలో అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్‌గా (ఏ.ఓ) విధులు నిర్వహిస్తూ మల్కాజ్గిరి కమిషనరేట్‌కు బదిలీపై వెళ్తున్న శ్రీనివాస్ గారికి జిల్లా పోలీస్ కార్యాలయంలో ఘనంగా వీడ్కోలు కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా ఎస్పీ శ్రీ శరత్ చంద్ర పవార్ హాజరై శ్రీనివాస్ గారిని సత్కరించి ఆయన చేసిన సేవలను కొనియాడారు.

ఈ సందర్భంగా ఎస్పీ శరత్ చంద్ర పవార్ మాట్లాడుతూ, జిల్లా పోలీస్ కార్యాలయంలో పనిచేసిన కాలంలో శ్రీనివాస్ తమ విధులను ఎంతో నిబద్ధతతో, బాధ్యతాయుతంగా నిర్వహించారని తెలిపారు. కార్యాలయ పరిపాలనలో సమర్థవంతమైన సేవలు అందిస్తూ సహచరులతో సత్సంబంధాలు కొనసాగించారని, తన అనుభవంతో పోలీస్ శాఖ పనితీరుకు మంచి సహకారం అందించారని కొనియాడారు. మల్కాజ్గిరి కమిషనరేట్‌లో కూడా ఇదే విధంగా ఉత్తమ సేవలు అందించాలని ఆకాంక్షించారు.

తనకు అందించిన సత్కారానికి స్పందించిన ఏ.ఓ శ్రీనివాస్ మాట్లాడుతూ, నల్గొండ జిల్లాలో పనిచేసిన కాలం తనకు ఎంతో సంతృప్తిని ఇచ్చిందని తెలిపారు. జిల్లా ఎస్పీతో పాటు సహచర అధికారులు, సిబ్బంది అందించిన సహకారం వల్లే తన విధులను సక్రమంగా నిర్వహించగలిగానని అన్నారు. ఇక్కడ పనిచేసిన అనుభవాన్ని ఎప్పటికీ మరిచిపోలేనని చెప్పారు.
ఈ సందర్భంగా ఎస్పీ శరత్ చంద్ర పవార్ శ్రీనివాస్ గారికి శాలువా కప్పి, జ్ఞాపిక అందజేసి ఘనంగా సత్కరించారు.

ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పి రమేష్,జిల్లా పోలీస్ కార్యాలయానికి చెందిన అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.జిల్లా పోలీస్ కార్యాలయంలో పని చేస్తూ బదిలీపై వెళ్తున్న అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్‌ (ఏ.ఓ) శ్రీనివాస్‌కు ఘన వీడ్కోలు

రూ.1,77,000 నగదు, ఒక సెల్ ఫోన్ స్వాధీనం – వన్ టౌన్ సీఐ రాజశేఖర్ రెడ్డి

నల్గొండ జిల్లా పోలీస్ కార్యాలయంలో అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్‌గా (ఏ.ఓ) విధులు నిర్వహిస్తూ మల్కాజ్గిరి కమిషనరేట్‌కు బదిలీపై వెళ్తున్న శ్రీనివాస్ గారికి జిల్లా పోలీస్ కార్యాలయంలో ఘనంగా వీడ్కోలు కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా ఎస్పీ శ్రీ శరత్ చంద్ర పవార్ హాజరై శ్రీనివాస్ గారిని సత్కరించి ఆయన చేసిన సేవలను కొనియాడారు.

ఈ సందర్భంగా ఎస్పీ శరత్ చంద్ర పవార్ మాట్లాడుతూ, జిల్లా పోలీస్ కార్యాలయంలో పనిచేసిన కాలంలో శ్రీనివాస్ తమ విధులను ఎంతో నిబద్ధతతో, బాధ్యతాయుతంగా నిర్వహించారని తెలిపారు. కార్యాలయ పరిపాలనలో సమర్థవంతమైన సేవలు అందిస్తూ సహచరులతో సత్సంబంధాలు కొనసాగించారని, తన అనుభవంతో పోలీస్ శాఖ పనితీరుకు మంచి సహకారం అందించారని కొనియాడారు. మల్కాజ్గిరి కమిషనరేట్‌లో కూడా ఇదే విధంగా ఉత్తమ సేవలు అందించాలని ఆకాంక్షించారు.

తనకు అందించిన సత్కారానికి స్పందించిన ఏ.ఓ శ్రీనివాస్ మాట్లాడుతూ, నల్గొండ జిల్లాలో పనిచేసిన కాలం తనకు ఎంతో సంతృప్తిని ఇచ్చిందని తెలిపారు. జిల్లా ఎస్పీతో పాటు సహచర అధికారులు, సిబ్బంది అందించిన సహకారం వల్లే తన విధులను సక్రమంగా నిర్వహించగలిగానని అన్నారు. ఇక్కడ పనిచేసిన అనుభవాన్ని ఎప్పటికీ మరిచిపోలేనని చెప్పారు.
ఈ సందర్భంగా ఎస్పీ శరత్ చంద్ర పవార్ శ్రీనివాస్ గారికి శాలువా కప్పి, జ్ఞాపిక అందజేసి ఘనంగా సత్కరించారు.

ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పి రమేష్,జిల్లా పోలీస్ కార్యాలయానికి చెందిన అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *