బ్రేకింగ్ న్యూస్
చోరీ, పోగొట్టుకున్న మొబైల్ ఫోన్ల కొనుగోలు, విక్రయాలపై కఠిన చర్యలుహైదరాబాద్‌లో వాసవి కాలేజ్‌ విద్యార్థులకు ‘అరైవ్ అలైవ్’ రోడ్డు భద్రతా అవగాహననల్లగొండలో వరుస పగటి చోరీలకు చెక్.. అంతర్రాష్ట్ర దొంగ అరెస్ట్బంజారాహిల్స్‌ అత్యాచారం కేసులో నిందితుడికి 10 ఏళ్ల కఠిన కారాగార శిక్షగంజాయి వ్యసన నిర్మూలనే లక్ష్యం: బాధితులకు మెరుగైన వైద్యం అందించాలితెలంగాణ ఉద్యమ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ జయంతి ఘనంగా నిర్వహించిన నల్గొండ జిల్లా పోలీసులుఆచార్య జయశంకర్ సార్ జయంతి సందర్భంగా ఘన నివాళులు అర్పించిన సంగారెడ్డి అదనపు ఎస్పీసిరియల్ ఇళ్ల దొంగతనాల ముఠా అరెస్ట్.. రూ.12 లక్షల విలువైన బంగారం, వెండి స్వాధీనంప్రశాంతమైన జీవన విధానం అలవర్చుకోవాలి: మహబూబాబాద్ ఎస్పీ డా. శబరీష్విద్యార్థి దశ నుంచే సైబర్ మోసాలకు ఫుల్ స్టాప్.. సైబర్ సురక్షిత తెలంగాణ నిర్మిద్దాం: జిల్లా ఎస్పీ మహేష్ బి. గితేచోరీ, పోగొట్టుకున్న మొబైల్ ఫోన్ల కొనుగోలు, విక్రయాలపై కఠిన చర్యలుహైదరాబాద్‌లో వాసవి కాలేజ్‌ విద్యార్థులకు ‘అరైవ్ అలైవ్’ రోడ్డు భద్రతా అవగాహననల్లగొండలో వరుస పగటి చోరీలకు చెక్.. అంతర్రాష్ట్ర దొంగ అరెస్ట్బంజారాహిల్స్‌ అత్యాచారం కేసులో నిందితుడికి 10 ఏళ్ల కఠిన కారాగార శిక్షగంజాయి వ్యసన నిర్మూలనే లక్ష్యం: బాధితులకు మెరుగైన వైద్యం అందించాలితెలంగాణ ఉద్యమ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ జయంతి ఘనంగా నిర్వహించిన నల్గొండ జిల్లా పోలీసులుఆచార్య జయశంకర్ సార్ జయంతి సందర్భంగా ఘన నివాళులు అర్పించిన సంగారెడ్డి అదనపు ఎస్పీసిరియల్ ఇళ్ల దొంగతనాల ముఠా అరెస్ట్.. రూ.12 లక్షల విలువైన బంగారం, వెండి స్వాధీనంప్రశాంతమైన జీవన విధానం అలవర్చుకోవాలి: మహబూబాబాద్ ఎస్పీ డా. శబరీష్విద్యార్థి దశ నుంచే సైబర్ మోసాలకు ఫుల్ స్టాప్.. సైబర్ సురక్షిత తెలంగాణ నిర్మిద్దాం: జిల్లా ఎస్పీ మహేష్ బి. గితే
Uncategorized

రూ.1,77,000 నగదు, ఒక సెల్ ఫోన్ స్వాధీనం – వన్ టౌన్ సీఐ రాజశేఖర్ రెడ్డి

రూ.1,77,000 నగదు, ఒక సెల్ ఫోన్ స్వాధీనం – వన్ టౌన్ సీఐ రాజశేఖర్ రెడ్డి

వైన్ షాప్ దొంగతనం కేసులో అంతరాష్ట్ర దొంగ అరెస్ట్ – సీసీటీవీ కెమెరాల సహాయంతో కేసు ఛేదించిన నల్లగొండ 1 టౌన్ పోలీసులు

రూ.1,77,000 నగదు, ఒక సెల్ ఫోన్ స్వాధీనం – వన్ టౌన్ సీఐ రాజశేఖర్ రెడ్డి

నల్గొండ పట్టణంలోని వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో మిర్యాలగూడ రోడ్‌లో ఉన్న మహాలక్ష్మి వైన్ షాప్‌లో జరిగిన దొంగతనం కేసును ఛేదించి, అంతరాష్ట్ర దొంగను అరెస్టు చేసినట్లు నల్గొండ వన్ టౌన్ సీఐ రాజశేఖర్ రెడ్డి తెలిపారు.
నిందితుడి వద్ద నుండి రూ.1,77,000 నగదు మరియు ఒక సెల్ ఫోన్‌ను స్వాధీనం చేసుకొని కోర్టులో హాజరు పరచి రిమాండ్‌కు తరలించినట్లు వెల్లడించారు.

నల్గొండ జిల్లాను నేర రహిత జిల్లాగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో జిల్లా ఎస్పీ శ్రీ శరత్ చంద్ర పవార్, ఐపీఎస్ ఆధ్వర్యంలో “నేను సైతం” కార్యక్రమం ద్వారా వ్యాపార సంస్థలు, షాపులు మరియు వార్డులలో సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని వ్యాపారస్తులు, ప్రజలకు అవగాహన కల్పిస్తున్నట్లు తెలిపారు. ముఖ్యంగా దొంగతనాలు జరగకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై కూడా పలుమార్లు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు.

ఈ క్రమంలో 07-12-2025 తేదీన రాత్రి నల్గొండ పట్టణంలోని మిర్యాలగూడ రోడ్‌లో గల మహాలక్ష్మి వైన్ షాప్‌లో గుర్తు తెలియని వ్యక్తి సుమారు రూ.5 లక్షలకు పైగా నగదు దోచుకెళ్లినట్లు షాప్ యజమాని ఇచ్చిన ఫిర్యాదు మేరకు వన్ టౌన్ పోలీస్ స్టేషన్ ఇన్‌స్పెక్టర్ ఏ. రాజశేఖర్ రెడ్డి కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

సంగారెడ్డి జిల్లాలో ‘రౌడీ మేళా’.. సత్ప్రవర్తనతో ఉంటే హిస్టరీ షీట్లు క్లోజ్: అదనపు ఎస్పీ చైతన్య రెడ్డి

దర్యాప్తులో భాగంగా వైన్ షాప్‌లో ఏర్పాటు చేసిన సీసీటీవీ కెమెరాల ఫుటేజ్‌ను పరిశీలించగా, గతంలో పలు వైన్ షాపుల్లో దొంగతనాలు చేసిన అంతరాష్ట్ర నేరస్థుడు కుమ్మరి నర్సింహా రావు అని గుర్తించారు. వెంటనే జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు డీఎస్పీ కె. శివరాం రెడ్డి ఆధ్వర్యంలో వన్ టౌన్ పోలీస్ సిబ్బంది గాలింపు చర్యలు చేపట్టారు.
ఈ రోజు ఉదయం దేవరకొండ రోడ్‌లో అనుమానాస్పదంగా తిరుగుతున్న వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకొని విచారించగా, నల్గొండ పట్టణంలోని మూడు వైన్ షాపుల్లో దొంగతనాలు చేసినట్లు ఒప్పుకున్నాడు. అనంతరం అతడి వద్ద నుండి మహాలక్ష్మి వైన్ షాప్ దొంగతనానికి సంబంధించిన రూ.1,77,000 నగదు మరియు ఒక సెల్ ఫోన్‌ను స్వాధీనం చేసుకొని కోర్టులో హాజరు పరిచి రిమాండ్‌కు తరలించారు.

నిందితుడి వివరాలు :
కుమ్మరి నర్సింహా రావు (35), తండ్రి అంజయ్య, కులం కుమ్మరి, వృత్తి కుక్ మాస్టర్. స్వస్థలం సయ్యద్ మల్కాపూర్ గ్రామం, పరిగి మండలం, వికారాబాద్ జిల్లా. ప్రస్తుతం మచ్చయపాలెం గ్రామం, బెల్లంకొండ మండలం, గుంటూరు జిల్లా నివాసి.
నిందితుడు గతంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పలు పోలీస్ స్టేషన్ పరిధిలో మూడు దొంగతనాలు చేసి జైలుకు వెళ్లి బెయిల్‌పై బయటకు వచ్చినట్లు విచారణలో వెల్లడైంది. అనంతరం ఆంధ్రప్రదేశ్‌లో దొంగతనాలు చేస్తే పోలీసులు గుర్తించే అవకాశం ఉందని భావించి తెలంగాణ రాష్ట్రంలో దొంగతనాలు చేయడం ప్రారంభించినట్లు తెలిపాడు.

ఈ కేసును ఛేదించడంలో ఉత్తమ ప్రతిభ కనబర్చిన నల్గొండ వన్ టౌన్ పోలీస్ స్టేషన్ ఇన్‌స్పెక్టర్ శ్రీ ఏ. రాజశేఖర్ రెడ్డి, ఎస్ఐలు సతీష్, లచ్చిరెడ్డి, వెంకటనారాయణ మరియు సిబ్బంది అంజయ్య, రబ్బానీ శ్రీను లను డీఎస్పీ కె. శివరాం రెడ్డి అభినందించారు.