యుగయుగాల నుండి ఎందరో ఆధ్యాత్మిక సాధకులకు, మోక్ష సాధకులకు, సకల దేవతలకు నిలయం శ్రీశైలం.
శ్రీభ్రమరాంబా మల్లికార్జునస్వామివార్లు కొలువైన ఈ క్షేత్రం అష్టాదశశక్తి క్షేత్రాలలో ఆరో క్షేత్రం, ద్వాదశ జ్యోతిర్లింగాలలో రెండవ క్షేత్రం. భూమండలానికి నాభిస్థానం.
ఇలలో వెలసిన కైలాసం.
కోరినవన్నీ అనుగ్రహించే క్షేత్రం.
ఈ క్షేత్రాన్ని సందర్శించే భక్తుల సంఖ్య విశ్వం అనే పద్మంలో ఉండే కేసరాలను మించి ఉంటుందని పురాణాలు చెబుతుంటాయి.
శ్రీశైలంలో ప్రతి ఏడాది సంక్రాంతికి ఒకసారి, మహాశివరాత్రికి మరోసారి చొప్పున రెండుసార్లు బ్రహ్మోత్సవాలు జరగటం విశేషం.
కన్నుల పండువగా జరిగే ఈ బ్రహ్మోత్సవాలు ఈ ఏడాది ఫిబ్రవరి 08 నుండి 18 వరకు జరగనున్నాయి….
