మైలర్ దేవ్ పల్లి పిఎస్ పిరిది లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు చర్యలలో భాగంగా, రౌడీ షీటర్లకు కౌన్సెల్లింగ్ నిర్వహించడం జరిగినది.
ఈ రోజు సాయంత్రం 5 గంటలకు మైలర్ దేవ్ పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని రౌడీ షీటర్లను పిలిపించి, డిసిపి రాజేంద్ర నగర్ ఆధ్వర్యంలో కౌన్సెల్లింగ్ నిర్వహించడం జరిగినది.
కౌన్సెల్లింగ్ సందర్భంగా డిసిపి వారిని సూచిస్తూ, చట్ట విరుద్ధమైన కార్యకలాపాలకు దూరంగా ఉండాలని, ప్రజలతో శాంతియుతంగా మెలగాలని, రాత్రి సమయములలో బయట ఎక్కువగా తిరగరాదని, ఎలాంటి బెదిరింపు వసూళ్లు చేయరాదు అని, ఏరియాలో శాంతి భద్రతలకు భంగం కలిగించే చర్యలకు పాల్పడితే కఠిన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని మరియు PD Act కేసులు బుక్ చేస్తామని స్పష్టంగా తెలియజేయడం జరిగినది.
అలాగే, వారు మంచి ప్రవర్తనతో జీవన విధానాన్ని మార్చుకొని, సమాజంలో బాధ్యతాయుతమైన పౌరులుగా ఉండాలని సూచించడం జరిగింది. కౌన్సెల్లింగ్ అనంతరం, సంబంధిత రౌడీ షీటర్లు భవిష్యత్తులో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు పాల్పడబోమని హామీ ఇవ్వడం జరిగినది.
