ప్రశాంత వాతావరణంలో మున్సిపాలిటి ఎన్నికల నిర్వహనే లక్ష్యంగా, పటిష్ట భద్రతా ఏర్పాట్లు..
• ఎన్నికలను ప్రభావితం చేసే ఎలాంటివి అక్రమ రవాణ జరగకుండా పకడ్బందీగా చెక్ పోస్ట్ ల నిర్వహణ.. : అదనపు ఎస్పీ రఘునందన్ రావ్.
సంగారెడ్డి జిల్లా సురక్ష ప్రతినిధి : జిల్లా వ్యాప్తంగా 11 మున్సిపాలిటీ లలో ఎన్నికలు జరగనున్నాయని, ఎన్నికలను ప్రశాంత వాతారణంలో నిర్వహించేదుకు అన్నిరకాల భద్రత ఏర్పాట్లను చేసినట్లు అదనపు ఎస్పీ రఘునందన్ రావ్ వివరించారు. సమస్యాత్మక, సెన్సిటివ్, హైపర్ సెన్సిటివ్ పోలింగ్ కేంద్రాలను గుర్తించి, నిఘా కట్టుదిట్టం చేయాలని అధికారులకు సూచించడం జరిగిందన్నారు.
ఎస్.హెచ్.ఓ లు ప్రతి పోలింగ్ కేంద్రాన్ని సందర్శించి, పోలింగ్ డే రోజున ఎలాంటి వాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా అవసరమైన అన్ని రకాల భద్రత చర్యలను తీసుకోవాలని, ప్రహరీ గోడ లేని పోలింగ్ కేంద్రాలను గుర్తించి, తాత్కాలిక ప్రహరీలను ఏర్పాటు చేసేలా చూడాలని అన్నారు.
ఎన్నికలను ప్రభావితం చేసే మద్యం, డబ్బుల, మరే ఇతరములు పంపిణీ చేసినా, ఎన్నికల ప్రశాంతతకు భంగం కలిగించిన ఎన్నికల ప్రవర్తన నియమావళి ప్రకారం కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని హెచ్చరించారు.
సోషల్ మీడియాలో, ఇతర ప్రసార మాద్యమాలలో వ్యక్తులను గాని, రాజకీయ పార్టీలను గాని కించపరిచేలా తప్పుడు ప్రచారాలు చేసినా అట్టి వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది అన్నారు.
