బ్రేకింగ్ న్యూస్
రిటైర్డ్‌ ఐపీఎస్‌ అధికారి భార్య హత్య కేసులో కీలక పరిణామం.. నేపాల్‌ ముఠా సభ్యుడిపై పీడీ యాక్ట్‌ ప్రయోగంహెచ్-సిటీ పనులతో కేబీఆర్ పార్క్ చుట్టూ వన్‌వే ట్రాఫిక్ విధానంనాణ్యమైన దర్యాప్తుతో కేసులను వేగంగా పరిష్కరించాలి: జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్మిడ్ మ్యానేర్ బ్యాక్ వాటర్‌లో పర్యాటకుల భద్రతకు పటిష్ట చర్యలుచోరీ, పోగొట్టుకున్న మొబైల్ ఫోన్ల కొనుగోలు, విక్రయాలపై కఠిన చర్యలుహైదరాబాద్‌లో వాసవి కాలేజ్‌ విద్యార్థులకు ‘అరైవ్ అలైవ్’ రోడ్డు భద్రతా అవగాహననల్లగొండలో వరుస పగటి చోరీలకు చెక్.. అంతర్రాష్ట్ర దొంగ అరెస్ట్బంజారాహిల్స్‌ అత్యాచారం కేసులో నిందితుడికి 10 ఏళ్ల కఠిన కారాగార శిక్షగంజాయి వ్యసన నిర్మూలనే లక్ష్యం: బాధితులకు మెరుగైన వైద్యం అందించాలితెలంగాణ ఉద్యమ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ జయంతి ఘనంగా నిర్వహించిన నల్గొండ జిల్లా పోలీసులురిటైర్డ్‌ ఐపీఎస్‌ అధికారి భార్య హత్య కేసులో కీలక పరిణామం.. నేపాల్‌ ముఠా సభ్యుడిపై పీడీ యాక్ట్‌ ప్రయోగంహెచ్-సిటీ పనులతో కేబీఆర్ పార్క్ చుట్టూ వన్‌వే ట్రాఫిక్ విధానంనాణ్యమైన దర్యాప్తుతో కేసులను వేగంగా పరిష్కరించాలి: జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్మిడ్ మ్యానేర్ బ్యాక్ వాటర్‌లో పర్యాటకుల భద్రతకు పటిష్ట చర్యలుచోరీ, పోగొట్టుకున్న మొబైల్ ఫోన్ల కొనుగోలు, విక్రయాలపై కఠిన చర్యలుహైదరాబాద్‌లో వాసవి కాలేజ్‌ విద్యార్థులకు ‘అరైవ్ అలైవ్’ రోడ్డు భద్రతా అవగాహననల్లగొండలో వరుస పగటి చోరీలకు చెక్.. అంతర్రాష్ట్ర దొంగ అరెస్ట్బంజారాహిల్స్‌ అత్యాచారం కేసులో నిందితుడికి 10 ఏళ్ల కఠిన కారాగార శిక్షగంజాయి వ్యసన నిర్మూలనే లక్ష్యం: బాధితులకు మెరుగైన వైద్యం అందించాలితెలంగాణ ఉద్యమ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ జయంతి ఘనంగా నిర్వహించిన నల్గొండ జిల్లా పోలీసులు
Hyderabad

నూతన సంవత్సర వేడుకల నేపథ్యంలో జిల్లా వ్యాప్తంగా అర్ద రాత్రి విస్తృత తనిఖీలు చేసిన జిల్లా పోలీస్

నూతన సంవత్సర వేడుకల నేపథ్యంలో జిల్లా వ్యాప్తంగా అర్ద రాత్రి విస్తృత తనిఖీలు చేసిన జిల్లా పోలీస్

నూతన సంవత్సర వేడుకల నేపథ్యంలో జిల్లా వ్యాప్తంగా అర్ద రాత్రి విస్తృత తనిఖీలు చేసిన జిల్లా పోలీస్

– అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా ‘ఆపరేషన్ చెబుత్రా’ అమలు

సరైన పత్రాలు లేని సుమారు 150 వాహనాలను సీజ్

మద్యం సేవించి వాహనాలు నడుపుతూ పట్టుబడిన 30 మంది పైన కేసులు నమోదు

చట్టాన్ని ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవు .

నూతన సంవత్సర వేడుకల సందర్భంగా జిల్లా వ్యాప్తంగా శాంతి భద్రతలు పటిష్టంగా ఉంచేందుకు జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్, ఐపీఎస్ ఆదేశాల మేరకు పోలీసులు అర్ద రాత్రి జిల్లా వ్యాప్తంగా విస్తృత తనిఖీలు చేపట్టిన్నారు.

రిటైర్డ్‌ ఐపీఎస్‌ అధికారి భార్య హత్య కేసులో కీలక పరిణామం.. నేపాల్‌ ముఠా సభ్యుడిపై పీడీ యాక్ట్‌ ప్రయోగం

డిసెంబర్ 31 అర్ధరాత్రి వరకు జిల్లా వ్యాప్తంగా ‘స్పెషల్ ఎన్‌ఫోర్స్‌మెంట్ డ్రైవ్‌లు’ నిర్వహిస్తూ, ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా ఆపరేషన్ చెబుత్రా ను కఠినంగా అమలు చేస్తున్నట్లు పేర్కొన్నారు.

ఈ సందర్భంగా అర్ధరాత్రి సమయంలో పోలీస్ అధికారులు, సిబ్బంది రంగంలోకి దిగి, జిల్లాలోని రద్దీ ప్రాంతాలు, సమస్యాత్మక ప్రాంతాలు, ప్రధాన కూడళ్లు, వాహనాలపై ప్రత్యేక చెక్‌పోస్టులు ఏర్పాటు చేసి విస్తృత తనిఖీలు నిర్వహించినారు. నార్కోటిక్ డాగ్ స్క్వాడ్ సహాయంతో డ్రగ్స్ నియంత్రణపై ప్రత్యేక దృష్టి సారించి కఠిన చర్యలు తీసుకుంటున్నారు.

జిల్లా వ్యాప్తంగా నిర్వహించిన స్పెషల్ డ్రైవ్‌లలో చేపట్టిన చర్యలు:

  • పత్రాలు లేని 150 వాహనాలను సీజ్ చేయడం జరిగింది.
  • మద్యం సేవించి వాహనాలు నడిపిన 30 మందిపై (డ్రంక్ అండ్ డ్రైవ్) కేసులు నమోదు చేశారు.
  • పాత నేరస్థులు, డ్రగ్స్ కేసుల్లో గతంలో పట్టుబడిన వారి కదలికలపై నిరంతర నిఘా కొనసాగిస్తున్నారు.

ఈ సందర్బంగా జిల్లా యస్పి గారు మాట్లాడుతూ న్యూ ఇయర్ వేడుకల సందర్భంగా ప్రజలకు ఇబ్బందులు కలిగించే విధంగా రహదారులపై హంగామా, బహిరంగ ప్రదేశాల్లో పార్టీలు, మద్యం సేవివించడం, డీజే కార్యక్రమాలకు అనుమతి లేదని స్పష్టం చేశారు. నిబంధనలు ఉల్లంఘించి పట్టుబడితే వాహనం సీజ్ చేయడంతో పాటు రూ.10,000 జరిమానా, ఆరు నెలల జైలు శిక్ష తప్పదని హెచ్చరించారు.

ప్రజలు నూతన సంవత్సర వేడుకలను ప్రశాంత వాతావరణంలో ఇంటి వద్దనే నిర్వహించుకోవాలని, పోలీస్ శాఖకు సహకరించాలని, అనుమానాస్పద చర్యలు గమనిస్తే వెంటనే సమాచారం అందించాలని కోరారు.