నూతన సంవత్సర వేడుకల నేపథ్యంలో జిల్లా వ్యాప్తంగా అర్ద రాత్రి విస్తృత తనిఖీలు చేసిన జిల్లా పోలీస్
– అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా ‘ఆపరేషన్ చెబుత్రా’ అమలు
సరైన పత్రాలు లేని సుమారు 150 వాహనాలను సీజ్
మద్యం సేవించి వాహనాలు నడుపుతూ పట్టుబడిన 30 మంది పైన కేసులు నమోదు
చట్టాన్ని ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవు .

నూతన సంవత్సర వేడుకల సందర్భంగా జిల్లా వ్యాప్తంగా శాంతి భద్రతలు పటిష్టంగా ఉంచేందుకు జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్, ఐపీఎస్ ఆదేశాల మేరకు పోలీసులు అర్ద రాత్రి జిల్లా వ్యాప్తంగా విస్తృత తనిఖీలు చేపట్టిన్నారు.
డిసెంబర్ 31 అర్ధరాత్రి వరకు జిల్లా వ్యాప్తంగా ‘స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ డ్రైవ్లు’ నిర్వహిస్తూ, ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా ఆపరేషన్ చెబుత్రా ను కఠినంగా అమలు చేస్తున్నట్లు పేర్కొన్నారు.
ఈ సందర్భంగా అర్ధరాత్రి సమయంలో పోలీస్ అధికారులు, సిబ్బంది రంగంలోకి దిగి, జిల్లాలోని రద్దీ ప్రాంతాలు, సమస్యాత్మక ప్రాంతాలు, ప్రధాన కూడళ్లు, వాహనాలపై ప్రత్యేక చెక్పోస్టులు ఏర్పాటు చేసి విస్తృత తనిఖీలు నిర్వహించినారు. నార్కోటిక్ డాగ్ స్క్వాడ్ సహాయంతో డ్రగ్స్ నియంత్రణపై ప్రత్యేక దృష్టి సారించి కఠిన చర్యలు తీసుకుంటున్నారు.

జిల్లా వ్యాప్తంగా నిర్వహించిన స్పెషల్ డ్రైవ్లలో చేపట్టిన చర్యలు:
- పత్రాలు లేని 150 వాహనాలను సీజ్ చేయడం జరిగింది.
- మద్యం సేవించి వాహనాలు నడిపిన 30 మందిపై (డ్రంక్ అండ్ డ్రైవ్) కేసులు నమోదు చేశారు.
- పాత నేరస్థులు, డ్రగ్స్ కేసుల్లో గతంలో పట్టుబడిన వారి కదలికలపై నిరంతర నిఘా కొనసాగిస్తున్నారు.
ఈ సందర్బంగా జిల్లా యస్పి గారు మాట్లాడుతూ న్యూ ఇయర్ వేడుకల సందర్భంగా ప్రజలకు ఇబ్బందులు కలిగించే విధంగా రహదారులపై హంగామా, బహిరంగ ప్రదేశాల్లో పార్టీలు, మద్యం సేవివించడం, డీజే కార్యక్రమాలకు అనుమతి లేదని స్పష్టం చేశారు. నిబంధనలు ఉల్లంఘించి పట్టుబడితే వాహనం సీజ్ చేయడంతో పాటు రూ.10,000 జరిమానా, ఆరు నెలల జైలు శిక్ష తప్పదని హెచ్చరించారు.

ప్రజలు నూతన సంవత్సర వేడుకలను ప్రశాంత వాతావరణంలో ఇంటి వద్దనే నిర్వహించుకోవాలని, పోలీస్ శాఖకు సహకరించాలని, అనుమానాస్పద చర్యలు గమనిస్తే వెంటనే సమాచారం అందించాలని కోరారు.
