Breaking News

ప్రజా సమస్యల సత్వర పరిష్కారానికి ప్రజావాణి / గ్రీవెన్స్ డే..

• ప్రజా సమస్యల సత్వర పరిష్కారానికి ప్రజావాణి / గ్రీవెన్స్ డే..
• ఫిర్యాదుదారులతో ప్రత్యక్షంగా మాట్లాడి, ఫిర్యాదులను స్వీకరించిన జిల్లా ఎస్పీ..
• బాధితులకు భరోసా కల్పించండి.. ఎస్‌.హెచ్‌.ఓలకు ఫోన్ ద్వారా పలు సూచనలు..
:జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్..


సంగారెడ్డి జిల్లా సురక్ష ప్రతినిధి: ప్రజా సమస్యల సత్వర పరిష్కారానికి ప్రతి సోమవారం జిల్లా పోలీసు కార్యాలయంలో ప్రాజావాణి కార్యక్రమాన్ని నిర్వహిచడం జరుగుతుందని జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ అన్నారు. ఈ సందర్భంగా సమస్యలతో జిల్లా పోలీసు కార్యాలయానికి వచ్చిన ఫిర్యాదిదారుల నుండి స్వయంగా ఫిర్యాదులను స్వీకరించి, వారి సమస్యను విని, సమస్యకు కారణమవుతున్న అంశాలపై సంబంధిత ఎస్‌.హెచ్‌.ఓలతో ఫోన్ ద్వారా మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. ప్రతి కేసును పారదర్శకంగా దర్యాప్తు చేసి బాధితులకు భరోసా కల్పించాలని ఎస్పీ ఎస్‌.హెచ్‌.ఓలకు సూచించడం జరిగింది.
ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ.. మీ సమస్యలు స్థానిక పోలీస్ స్టేషన్‌లలో పరిష్కారం దొరకనప్పుడు ఎలాంటి ఒత్తిళ్లకు, ప్రలోభాలకు లోనుకాకుండా నేరుగా జిల్లా పోలీస్ కార్యాలయంలో ప్రతి సోమవారం నిర్వహించబడుతున్న ప్రజావాణి కార్యక్రమ సేవలను వినియోగించుకోవాలని ఎస్పీ విజ్ఞప్తి చేశారు.

నెంబర్ ప్లేట్ ట్యాంపరింగ్‌కు పాల్పడితే కఠిన చర్యలు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *