హోం గార్డ్ ఆఫీసర్స్ సంక్షేమానికి ఎల్లప్పుడూ కృషి జిల్లా ఎస్పి శరత్ చంద్ర పవార్ ఐపిఎస్
హోం గార్డ్ సిబ్బంది సమస్యలపై దర్బార్..
జిల్లా పోలీస్ శాఖలో అంతర్భాగమైన హోంగార్డ్ సిబ్బంది పోలీసులతో సమానంగా శాంతి భద్రతల పరిరక్షణలో అనునిత్యం కష్టపడుతూ క్రమశిక్షణతో విధులు నిర్వహిస్తూన్నారని, వారి సంక్షేమానికి పోలీస్ శాఖ ఎల్లప్పుడు కృషి చేస్తుందని జిల్లా ఎస్పీ అన్నారు.

జిల్లా పోలీస్ కార్యాలయంలో హోంగార్డు సిబ్బందికి ఏర్పాటు చేసిన దర్బార్లో వారి సమస్యల గురించి అడిగి తెలుసుకుని మాట్లాడుతూ ప్రజల రక్షణ, శాంతిభద్రతల పరిరక్షణ లక్ష్యంగా 1946 డిసెంబర్ 6న స్వచ్ఛందంగా ప్రారంభమైన హోంగార్డ్ వ్యవస్థ నేడు పోలీసు శాఖలో భాగమై శాంతి భద్రతల పరిరక్షణ,ట్రాఫిక్ నియంత్రణ,నేర సంబంధిత విధుల నిర్వహణ వీరి పాత్ర ప్రశంసనీయం అని అన్నారు.
హోంగార్డ్ సిబ్బంది సంక్షేమం దృష్ట్యా రాష్ట్ర ప్రభుత్వం రోజువారీ వేతనాన్ని ₹921 నుండి ₹1000కి, అలాగే పరేడ్ అలవెన్స్ను ₹100 నుండి ₹200కి పెంచడం, యూనిఫామ్ అలవెన్స్ 7500 రూపాయలు,విధి నిర్వహణలో మరణించిన సిబ్బందికి ₹5 లక్షల ఎక్స్గ్రేషియా లాంటి సంక్షేమాలు ఇవ్వడం జరిగిందని తెలియజేశారు. సిబ్బంది ప్రతి ఒక్కరు తమకు అప్పగించిన విధులను క్రమశిక్షణతో, అంకిత భావంతో, బాధ్యతాయుతంగా నిర్వర్తించాలని అన్నారు. అలాగే ఆరోగ్యం పై కూడా ప్రత్యేక శ్రద్ధ చూయించాలని తెలిపారు. హోంగార్డ్ సంక్షేమానికి,సమస్యల పరిష్కారానికి జిల్లా పోలీసు శాఖ ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటుందని స్పష్టం చేశారు.

ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ రమేష్,ఎస్బి డిఎస్పి మల్లారెడ్డి,ఏఆర్ డిఎస్పి శ్రీనివాసులు,ఎస్బిసిఐ రాము,హోంగార్డ్ ఆర్.ఐ శ్రీను, అడ్మిన్ ఆర్.ఐ సంతోష్, యం.టి ఆర్.ఐ సూరపు నాయుడు, ఆర్.ఎస్ ఐ శ్రావణి,హోమ్ గార్డ్ ఆఫీసర్స్ తదితరులు పాల్గొన్నారు

