సమస్యాత్మక గ్రామాలపై ప్రత్యేక నిఘా జిల్లా ఎస్పి శరత్ చంద్ర పవార్ ఐపీఎస్
*శాంతి యుత వాతావరణంలో ఓటు హక్కు వినియోగించికోవాలి జిల్లా ఎస్పి
జిల్లాలో గ్రామపంచాయతీ ఎన్నికల నేపథ్యంలో ప్రజలు శాంతియుత వాతావరణం లో ఓటు హక్కు వినియోగించుకోవాలని జిల్లా ఎస్పీ అన్నారు.
కనగల్ మండలం సమసాత్మక గ్రామము జి.ఎడవెల్లి సందర్శించి అక్కడి స్థానిక ప్రజా ప్రతినిధులు, ప్రజలు, యువకులకు ఎన్నికల నియమాలకు సంబంధించిన అంశాలపై అవగాహన కల్పించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ మాట్లాడుతూ గ్రామపంచాయతీ ఎన్నికల నేపథ్యంలో ప్రజలు శాంతియుత వాతావరణంలో తమ ఓటు హక్కు వినియోగించుకునేలా పోలీస్ యంత్రాంగం అహర్నిశలు పనిచేస్తుందని ఎవరైనా గొడవలకు కారకులు అయితే వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
ఎన్నికల సమయంలో అభ్యర్థులు మరియు ప్రజలు ఎన్నికల నిబంధనలకు విరుద్ధంగా ర్యాలీలు, ధర్నాలు పూర్తిగా నిషేధం అని తెలుపారు. జిల్లాలో ఎన్నికల నియమావళి అమలులో ఉన్నందున ఎవరూ ఓటర్లను ప్రలోభపెట్టే మధ్యం,నగదు ఉచితాలు పంపిణి చేయకూడని అన్నారు.ఎవరైనా అలాంటి చర్యలకు పట్టుబడితే సంబంధిత వ్యక్తులపై కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు.

ప్రతి ఒక్కరు ఎన్నికల నియమావళికి లోబడి నడుచుకోవాలి, ప్రలోభాలకు గురికాకుండా స్వేచ్ఛగా ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలని గ్రామ ప్రజలకు ఎస్పి విజ్ఞప్తి చేశారు .
ఈ కార్యక్రమం లో డియస్పి శివరాం రెడ్డి, చండూరు సిఐ ఆదిరెడ్డి కనగల్ ఎస్సై రాజీవ్ రెడ్డి, ప్రశాంత్, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.
