Breaking News

• తెలంగాణ ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్సియల్ లా కళాశాల ఆధ్వర్యంలో నిర్వహించిన 76 వ రాజ్యంగా అమలు దినోత్సవానికి హాజరైన జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్..

• తెలంగాణ ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్సియల్ లా కళాశాల ఆధ్వర్యంలో నిర్వహించిన 76 వ రాజ్యంగా అమలు దినోత్సవానికి హాజరైన జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్..


సంగారెడ్డి జిల్లా, నవంబర్-26: 76వ భారత రాజ్యాంగ అమలు దినోత్సవాన్ని పురస్కరించుకొని తెలంగాణ ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్సియల్ లా కళాశాల, సంగారెడ్డిలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి హాజరైన జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్.. ఈ సందర్భంగా ఎస్పీ పరితోష్ పంకజ్ మాట్లాడుతూ, ప్రపంచంలోనే అత్యంత గొప్ప, లిఖిత రాజ్యాంగం భారత రాజ్యాంగం అని, భారత స్వాతంత్ర్య అనంతరం అని, డా. బి.ఆర్. అంబేద్కర్ గారి అధ్యక్షతన రాజ్యాంగం రూపుదిద్దుకోవడానికి సుమారు రెండున్నర పట్టిందని, 1949 నవంబర్ 26న రాజ్యాంగం ఆమోదం పొందిందని, రాజ్యాంగం మన దేశానికి మూలాధారం జిల్లా ఎస్పీపేర్కొన్నారు. ఆర్టికల్ 32 పౌరుల ప్రాథమిక హక్కులను రక్షించే అత్యంత శక్తివంతమైన ఆయుధం అని, ఈ ఆర్టికల్‌ను డా. అంబేద్కర్ “రాజ్యాంగ హృదయం” అని పిలిచారన్నారు. ఈ ఆర్టికల్ నందు ప్రాథమిక హక్కులకు భంగం కలిగితే నేరుగా సుప్రీం కోర్టును ఆశ్రయించే హక్కు పౌరులకు ఇస్తుందని వెల్లడించారు. రాజ్యాంగం ఇచ్చిన హక్కులు మరియు చేయవలసిన విధులు పౌరులందరూ తెలుసుకొని, వాటిని అమలు చేయడం ద్వారా దేశాభివృద్ధికి తోడ్పడాలని ఎస్పీ పిలుపునిచ్చారు.

నల్లగొండ జిల్లాలో ప్రశాంతంగా కొనసాగుతున్న మున్సిపాలిటీ ఎన్నికల ప్రక్రియ..


ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ప్రవీణ్య, జిల్లా లీగల్ సర్వీస్ అథోరిటీ – సౌజన్య, తెలంగాణ ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్సియల్ లా కళాశాల ప్రిన్సిపల్, అధ్యాపకులు, లా విద్యార్ధులు తదితరులు ఉన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *