Breaking News

సిరిసిల్ల పట్టణ పరిధిలోని పాన్ షాప్,లాడ్జీ లలో పోలీసు నార్కోటిక్ జాగిలాలతో ఆకస్మిక తనిఖీలు.

సిరిసిల్ల పట్టణ పరిధిలోని పాన్ షాపులు, లాడ్జీలలో జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు టాస్క్‌ఫోర్స్ సిబ్బంది. నార్కోటిక్ జాగిలాలతో ఆకస్మిక విస్తృత తనిఖీలు నిర్వహించినట్లు టాస్క్ఫోర్స్ ఇన్స్పెక్టర్ నటేష్ తెలిపారు. ఈ సందర్భంగా సి.ఐ మాట్లాడుతూ.జిల్లాలో గంజాయి లాంటి పదార్థాల నిర్ములానే లక్ష్యంగా జిల్లా పోలీస్ శాఖ పని చేస్తుందని,టాస్క్ఫోర్స్ సిబ్బంది మత్తు పదార్థాలను గుర్తించే నార్కోటిక్ జాగిలలతో తరచు జిల్లా పరిధిలో ఉన్న లాడ్జిలలో,పాన్ షాప్,కిరాణా షాప్ లలో,బస్టాండ్ ప్రాంతాల్లో,రద్దీగాల ప్రాంతాల్లో విస్తృత తనిఖీలు చేయడం జరుగుతుందని తెలిపారు. జిల్లాలో విన్నూత కార్యక్రమాల ద్వారా ప్రజలకి మత్తు పదార్థాల వల్ల కలుగు ఆనార్ధాల గురించి అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందన్నారు. జిల్లాలో గంజాయి రవాణా చేసిన,అమ్మిన,సేవించిన కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. నిషేధించిన గంజాయి లాంటి మత్తు పదార్థాల సమాచారం ఉంటే వెంటనే డయల్ 100 లేదా దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్ లో సమాచారం అందించాలని సమాచారం అందించిన వారి పేర్లను గోప్యంగా ఉంచుతామని తెలిపారు.

మహిళల భద్రతే లక్ష్యం: షీ టీమ్స్ సిబ్బందికి రిఫ్రెషర్ కోర్స్ శిక్షణ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *