
“గొడవలు వద్దు – రాజీలు ముద్దు”వివాదాలు పెంచుకుంటే జీవితకాలం కొనసాగుతాయి కానీ “ఇంతటితో కలిసిపోదాం” అని ఒక నిర్ణయానికి వస్తే ఇప్పుడే ముగుస్తాయి.
వివాదాలా? లేక రాజీలా? మీరే నిర్ణయించుకోండి-ఎస్పీ సుధీర్ రాంనాధ్ కేకన్ IPS.
👉 ఉచిత న్యాయ సేవా అధికార సంస్థ ఆధ్వర్యంలో 🗓 తేదీ: 04-11-2025 నుండి 15-11-2025 వరకు మహబూబాబాద్ కోర్టులో “మెగా స్పెషల్ లోక్ అదాలత్” నిర్వహించబడుతుంది. ఈ సందర్భంగా మీపై కానీ, మీకు తెలిసిన వారిపై కానీ ఉన్న వివాదాస్పద కేసులను కోర్టుకు హాజరై రాజీ (కాంప్రమైజ్) చేసుకుంటే, ఆ కేసులు పూర్తిగా క్లోజ్ చేయబడతాయి.
రాజీ చేయదగిన కేసులు:
యాక్సిడెంట్ కేసులు.
కొట్టుకున్న (మార్పిడి గొడవల) కేసులు.
చీటింగ్ కేసులు.
వివాహ బంధానికి సంబంధించిన కేసులు.
చిన్నచిన్న దొంగతనం కేసులు.
ఇతర రాజీ చేయదగిన కేసులు మొదలైనవి.
ఈ మెగా లోక్ అదాలత్ ద్వారా ప్రజలు తమ కేసులను స్నేహపూర్వకంగా పరిష్కరించుకొని కొత్త జీవితానికి శ్రీకారం చుట్టవచ్చు. కాబట్టి, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి.
ఫిర్యాదుదారుడు మరియు నిందితుడు (ఇంజరీ అయిన వారు) ఇద్దరూ తమ ఆధార్ కార్డు తీసుకుని మహబూబాబాద్ కోర్టుకు హాజరు కావలసిందిగా కోరడమైనది. పూర్తి సమాచారం కోసం మీ దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్ లో సంప్రదించగలరు. ప్రజలందరూ ఈ మెగా లోక్ అదాలత్ ద్వారా ప్రయోజనం పొందగలరని జిల్లా ఎస్పీ సుదీర్ రామ్నాథ్ కేకన్, ఐపిఎస్ తెలిపారు.
