Breaking News

సమాజంలో నేరం చేసిన వారు ఎవరూ శిక్ష నుండి తప్పించుకోలేరు-జిల్లా ఎస్పీమహేష్ బి.గితే,ips.

నేరనియంత్రణ,న్యాయస్థానాలలో న్యాయ నిరూపణలో జిల్లా పోలీసులు విశేష ఫలితాలను సాధిస్తున్నారని జిల్లా ఎస్పీ మహేష్ బి. గితే తెలిపారు. ఈ సంవత్సరం (జనవరి నుండి అక్టోబర్) కాలంలో జిల్లా పోలీసు శాఖ సమగ్రంగా వ్యవహరించి న్యాయస్థానాల్లో 71 కేసుల్లో తీర్పులు వెలువడగా వాటిలో 82 మంది నేరస్తులకు జైలు శిక్షలు, జరిమానాలు విధించబడ్డాయని ఎస్పీ వివరించారు. న్యాయస్థానాల ద్వారా విధించబడిన జైలు శిక్షల వివరాలు: హత్య సంబంధించి 03 కేసులో 05మంది నిoదితులకు జీవిత ఖైదు. వివిద కేసులో జైలు శిక్షల వివరాలు: 5 సంవత్సరాల జైలు శిక్ష 04 కేసులలో 05 మంది నిoదితులు, 4 సంవత్సరాల జైలు శిక్ష 01 కేసులో ఒక నిoదితుడు, 3 సంవత్సరాల జైలు శిక్ష 11 కేసులలో 14 మంది నిoదితులు, 2 సంవత్సరాల జైలు శిక్ష 02 కేసులలో 03 మంది నిoదితులు, 1సంవత్సరాల జైలు శిక్ష 26 కేసులలో 28 మంది నిoదితులు, Below One Year 24 కేసులలో 26 మంది నిoదితులు. ఈసందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ —సమాజంలో నేరం చేసిన వారు ఎవరూ శిక్ష నుండి తప్పించుకోలేరు,పోలీసులు మరియు ప్రాసిక్యూషన్ విభాగం సమన్వయంతో వ్యూహాత్మకంగా విచారణ జరిపి న్యాయ నిరూపణతో శిక్షలు పడేలా చేస్తున్నాం. క్షణికావేశంలో చేసిన నేరాలకైనా న్యాయశిక్ష తప్పదు. అందరూ చట్టానికి లోబడేలా ప్రవర్తించాలని అన్నారు. జిల్లాలో మహిళలపై నేరాలు,మద్యం, గంజాయి,దొంగతనాలు, మోసపూరిత ఆర్థిక నేరాలపై ప్రత్యేక దృష్టి సారించి,కేసులు త్వరితగతిన దర్యాప్తు చేసి, కోర్టులో పటిష్టమైన సాక్ష్యాలతో ప్రాసిక్యూషన్ విజయవంతం అయ్యేలా చర్యలు తీసుకున్నామని తెలిపారు. జిల్లా ప్రాసిక్యూషన్ అధికారులు,సీఐలు,ఎస్ఐలు, ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్లు క్రమం తప్పకుండా కేసుల పురోగతిని సమీక్షిస్తూ,తీర్పులు శిక్షల రూపంలో రావడమే లక్ష్యంగా కృషి చేస్తున్నారని తెలిపారు. ప్రజలు పోలీసుల పట్ల నమ్మకం ఉంచి చట్టం పాటించేలా సహకరించాలని పిలుపునిచ్చారు.

మహిళల భద్రతే లక్ష్యం: షీ టీమ్స్ సిబ్బందికి రిఫ్రెషర్ కోర్స్ శిక్షణ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *