Breaking News

పోలీసు అమరవీరుల సంస్మరణ వారోత్సవాలు.

హైదరాబాద్ సిటీ పోలీస్, సెంట్రల్ జోన్, HCL మరియు హైదరాబాద్ సైక్లిస్ట్స్ సంయుక్త ఆధ్వర్యంలో ‘సైక్లథాన్’ను ఘనంగా మరియు విజయవంతంగా నిర్వహించడం జరిగింది. ఈ సైక్లథాన్ పీపుల్స్ ప్లాజా నుండి టోలీచౌకిలోని సెవెన్ టోంబ్స్ వరకు సాగింది. ఇందులో 380 మంది సైక్లిస్టులు, 100 మంది పోలీసు అధికారులు మరియు సిబ్బంది ఉత్సాహంగా పాల్గొన్నారు. డీజీ బి. శివధర్ రెడ్డి IPS మరియు సీపీ హైదరాబాద్ వి.సి. సజ్జనార్ IPS ఆదేశాల మేరకు ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సెంట్రల్ జోన్ డిసిపి శ్రీమతి కె. శిల్పవల్లి, ఐపిఎస్ హాజరయ్యారు. వారితో పాటు గాంధీనగర్ ఏసిపి యాదగిరి, ఖైరతాబాద్ ఎస్హెచ్ఓ వెంకట్ రెడ్డి మరియు HCL ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా డిసిపి శ్రీమతి కె. శిల్పవల్లి మాట్లాడుతూ, విధి నిర్వహణలో ప్రాణాలర్పించిన పోలీసు అమరవీరుల జ్ఞాపకార్థం పోలీసు శాఖతో కలిసి ఈ సైక్లథాన్ నిర్వహించిన HCL యాజమాన్యానికి మరియు హైదరాబాద్ సైక్లిస్ట్స్ కు కృతజ్ఞతలు తెలిపారు. ఇటువంటి కార్యక్రమాల వలన పోలీసుల పట్ల ప్రజల్లో సదభిప్రాయం కలుగుతుందని, పోలీసు-ప్రజా సంబంధాలు మరింత బలోపేతం అవుతాయని అన్నారు. ఇదే స్ఫూర్తితో మరిన్ని కార్పొరేట్ సంస్థలు సామాజిక కార్యక్రమాలలో భాగస్వాములు కావాలని ఆమె పిలుపునిచ్చారు. అలాగే, రేపు (27.10.2025) హైదరాబాద్ సిటీలోని అన్ని జోన్లలో నిర్వహించబడే “మెగా బ్లడ్ డొనేషన్ క్యాంపు”లో ప్రజలందరూ అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. సెంట్రల్ జోన్ పరిధిలోని ప్రజలందరూ పోలీసులతో స్నేహపూర్వకంగా మెలగాలని, శాంతిభద్రతల పరిరక్షణలో చురుకైన పాత్ర పోషించాలని డిసిపి విజ్ఞప్తి చేశారు. ఏదైనా అనుమానాస్పద కార్యకలాపాలు గమనిస్తే వెంటనే డయల్ 100 కు లేదా స్థానిక పోలీసు స్టేషన్‌కు సమాచారం అందించాలని కోరారు. “ప్రజా సహకారంతోనే సురక్షితమైన, నేరరహిత సమాజాన్ని నిర్మించగలం,” డిసిపి శ్రీమతి కె. శిల్పవల్లి పేర్కొన్నారు.

మహిళల భద్రతే లక్ష్యం: షీ టీమ్స్ సిబ్బందికి రిఫ్రెషర్ కోర్స్ శిక్షణ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *