Breaking News

జిల్లా పోలీస్ కార్యాలయంలో గ్రీవెన్స్ డే.

ప్రజా సమస్యల పరిష్కారానికి బాధితులకు అండగా ఉంటూ, ఫిర్యాదుల పై వెంటనే స్పందిస్తూ చట్టపరంగా చర్యలు తీసుకోవడం జరుగుతుందని జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ ఐపీఎస్ అన్నారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో గ్రీవెన్స్ డే సందర్భంగా జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వివిధ సమస్యల పై వచ్చిన దాదాపు 55 మంది అర్జీదారులతో నేరుగా మాట్లాడి సమస్యల తెలుసుకొని సంబంధిత అధికారులతో మాట్లాడి తక్షణ చర్యలు తీసుకోవాలని ఆదేశించడం జరిగింది. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ పోలీసు పరిధిలోని ప్రతి అంశాన్ని చట్ట పరిదిలో పరిష్కరించడంలో,బాధితులకు న్యాయం చేయడంలో వేగంగా చర్యలు తీసుకోవాలని అధికారులను ఎస్పీ ఆదేశించారు. బాధితులకు ఖచ్చితంగా న్యాయం జరుగుతుందని భరోసా కల్పించారు. అలాగే చట్టవ్యతిరేకంగా వ్యవహరిస్తూ, శాంతిభద్రతల పరిస్థితులకు భంగం కలిగించేవారి పట్ల,నేరాల పట్ల కఠినంగా వ్యవహరించాలని ఎస్పీ అధికారులను ఆదేశించారు.

మహిళల భద్రతే లక్ష్యం: షీ టీమ్స్ సిబ్బందికి రిఫ్రెషర్ కోర్స్ శిక్షణ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *