Breaking News

పోలీసు అమరులు చేసిన త్యాగాలను ప్రతి ఒక్కరు స్మరించుకోవాలి – అదనపు ఎస్పీ.

జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో పోలీసు అమరవీరుల సంస్మరణ వారోత్సవాలలో భాగంగా సాయంత్రం పట్టణ పరిధిలోని అంబేద్కర్ చౌరస్తా నుండి బతుకమ్మ ఘాట్ వరకు సైకిల్ ర్యాలీ నిర్వహించబడింది. విధి నిర్వహణలో ప్రాణాలను అర్పించిన పోలీసు అమరవీరుల త్యాగాలను ప్రతి ఒక్కరూ స్మరించుకోవాలని, సమాజంలో శాంతి భద్రతల స్థాపనకు పోలీసులు చేస్తున్న కృషి గురించి ప్రజలకు అవగాహన కల్పించడానికి ఇటువంటి కార్యక్రమాలు ఎంతో ఉపయోగకరమని తెలిపారు. అలాగే పోలీస్ శాఖ, ప్రజల మధ్య సత్సంబంధాలను బలోపేతం చేయడంలో ఇలాంటి అవగాహన కార్యక్రమాలు కీలక పాత్ర పోషిస్తాయన్నారు.సైకిల్ ర్యాలీలో పోలీస్ అధికారులు, సిబ్బంది, యువత, విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఇన్స్పెక్టర్లు కృష్ణ, మొగిలి, శ్రీనివాస్, వీరప్రసాద్, వెంకటేశ్వర్లు, నాగేశ్వరరావు, మధుకర్,ఆర్‌.ఐలు మధుకర్, రమేష్ ,యాదగిరి,ఎస్‌.ఐలు, ఆర్‌.ఎస్‌.ఐలు, పోలీస్ సిబ్బంది, విద్యార్థులు, యువత తదితరులు పాల్గొన్నారు.

మహిళల భద్రతే లక్ష్యం: షీ టీమ్స్ సిబ్బందికి రిఫ్రెషర్ కోర్స్ శిక్షణ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *