
సివి ఆనంద్ ఐపిఎస్ డిజి మరియు కమిషనర్ ఆఫ్ పోలీసు, హైదరాబాదు వెస్ట్ జోన్ లోని బోరబండా, రహమత్ నగర్ మరియు బంజారాహిల్స్ లోని ముఖ్యమైన గణేష్ మండపాల వద్ద ఆకస్మిక తనిఖీ నిర్వహించి, మండపాల నిర్వాహకులతో మరియు వాలంటీర్లతో మాట్లాడారు. ఆయా మండపాల వద్ద భద్రతను పరిశీలించి తగు సూచనలు ఇచ్చారు. వర్షాలు పడుతున్నందున మండపాల నిర్వాహకులు అందరూ తగు జాగ్రత్తలు తీసుకోవాలని, లేనిచో ప్రమాదాలు సంభవించే అవకాశం ఉందని వారికి సుచించారు. గణేష్ ఉత్సవాలు ప్రశాంత వాతావరణంలో జరిగే విధంగా భక్తులు, ప్రజలు అందరూ పోలీసు వారికి సహకరించాలని కోరారు.
ఈ కార్యక్రమములో ఎస్.ఎమ్.విజయ కుమార్ ఐపీఎస్ (డీసీపీ, వెస్ట్ జోన్), మరియు ఇతర అధికారులు పాల్గొన్నారు.
