Breaking News

వినాయక విగ్రహాల మండపాలను రాత్రి వేళలో ఆకస్మికంగా తనిఖీ – సి.వి. ఆనంద్ ఐ.పి.ఎస్.

సి.వి. ఆనంద్, ఐ.పి.ఎస్., డి.జి. మరియు కమిషనర్ ఆఫ్ పోలీసు, హైదరాబాద్, గణేష్ ఉత్సవాల సందర్భంగా హైదరాబాద్ పాత బస్తీ (సౌత్ జోన్) పరిధిలోని వినాయక విగ్రహాల మండపాలను రాత్రి వేళలో ఆకస్మికంగా తనిఖీ చేశారు. గణేష్ మండపాల వద్ద ఉన్న నిర్వాహకులతో మరియు వాలంటీర్లతో మాట్లాడినారు. ఆయా మండపాల వద్ద భద్రతను పరిశీలించి తగు సూచనలు ఇచ్చారు. వర్షాలు పడుతున్నందున మండపాల నిర్వాహకులు అందరూ తగు జాగ్రత్తలు తీసుకోవాలని, లేనిచో ప్రమాదాలు సంభవించే అవకాశం ఉందని వారికి తెలిపారు. గణేష్ ఉత్సవాలు ప్రశాంత వాతావరణంలో జరిగే విధంగా భక్తులు, ప్రజలు అందరూ పోలీసు వారికి సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో శ్రీమతి స్నేహా మెహ్రా, ఐ.పి.ఎస్., డి.సి.పి., సౌత్ జోన్, ఆర్. వెంకటేశ్వర్లు, ఐ.పి.ఎస్., డి.సి.పి., ట్రాఫిక్, మరియు సౌత్ జోన్ పరిధిలోని పోలీసు అధికారులు పాల్గొన్నారు.

చెర్లపల్లి సెంట్రల్ జైలు సందర్శించిన ట్రైనీ ఐపీఎస్, డీఎస్పీలు – జైలు సంస్కరణలపై అవగాహన

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *