Breaking News

ప్రజా సమస్యల సత్వర పరిష్కారం కోసం గ్రీవెన్స్ డే నిర్వహించిన జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ ఐపీఎస్ .

ప్రజా సమస్యల సత్వర పరిష్కారం కోసం గ్రీవెన్స్ డే నిర్వహించిన జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ ఐపీఎస్ .

జిల్లా ప్రజల సమస్యలను త్వరితగతిన పరిష్కరించడం లక్ష్యంగా నల్లగొండ జిల్లా పోలీస్ కార్యాలయంలో ఈ రోజు గ్రీవెన్స్ డే కార్యక్రమాన్ని జిల్లా ఎస్పీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా వివిధ ప్రాంతాల నుండి వచ్చిన దాదాపు 35 మంది ప్రజలు తమ వ్యక్తిగత,ఆర్థిక,భూ సంబంధిత సమస్యలను ఎస్పీ గారి దృష్టికి తీసుకువచ్చారు.

ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ ప్రతి ఒక్కరి ఫిర్యాదును విని, సంబంధిత అధికారులకు వెంటనే చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రజలకు న్యాయం జరిగేలా పోలీస్ శాఖ ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటుందని, ఎలాంటి సమస్య ఉన్నా ప్రజలు భయపడకుండా పోలీస్ శాఖను సంప్రదించాలని తెలిపారు.

విషయం: క్వి నెట్ (Q-Net) / విహాన్ డైరెక్ట్ సెల్లింగ్ మల్టీ లెవల్ మార్కెటింగ్ భారీ కుంభకోణం గుట్టురట్టు – 32 మంది నిందితుల అరెస్ట్.

ప్రజల నుండి అందిన ఫిర్యాదులను నమోదు చేసి, వాటి పరిష్కారం కోసం సంబంధిత పోలీస్ అధికారులకు సూచనలు జారీ చేయడం జరిగింది. ప్రజా సమస్యల పరిష్కారంలో పారదర్శకత మరియు వేగం ఉండేలా చర్యలు తీసుకుంటున్నామని ఎస్పీ పేర్కొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *