Breaking News

ఉగాది – రంజాన్ పండుగల నేపథ్యంలో మహబూబ్‌నగర్ వన్‌టౌన్‌లో పోలీసుల విస్తృత తనిఖీలు

ఉగాది – రంజాన్ పండుగల నేపథ్యంలో మహబూబ్‌నగర్ వన్‌టౌన్‌లో పోలీసుల విస్తృత తనిఖీలు

ఉగాది మరియు రంజాన్ పండుగల సందర్భంగా శాంతి భద్రతలు భంగం కలగకుండా ముందస్తు జాగ్రత్త చర్యలలో భాగంగా మహబూబ్‌నగర్ వన్‌టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో విస్తృత తనిఖీలు నిర్వహించారు. జిల్లా ఎస్పీ శ్రీమతి డి.జానకి, ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు వన్‌టౌన్ పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ అప్పయ్య, సబ్‌ఇన్స్పెక్టర్ సీనయ్య మరియు పోలీస్ సిబ్బంది కలిసి ముఖ్య ప్రాంతాల్లో కట్టుదిట్టమైన తనిఖీలు చేపట్టారు.

చెర్లపల్లి సెంట్రల్ జైలు సందర్శించిన ట్రైనీ ఐపీఎస్, డీఎస్పీలు – జైలు సంస్కరణలపై అవగాహన


ఈ సందర్భంగా వన్‌టౌన్ పరిధిలోని క్లాక్ టవర్ చౌరస్తా, మసీదులు, ట్యాంక్ బండ్ ప్రాంతం మరియు ఇతర ముఖ్య కూడళ్ల వద్ద డాగ్ స్క్వాడ్ సహాయంతో అనుమానాస్పద వస్తువులు, వ్యక్తులపై తనిఖీలు నిర్వహించారు. ప్రజలు పండుగలను ప్రశాంతంగా జరుపుకునే విధంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీస్ శాఖ అప్రమత్తంగా చర్యలు తీసుకుంటోంది.
ఈ సందర్భంగా వన్‌టౌన్ ఇన్స్పెక్టర్ అప్పయ్య మాట్లాడుతూ, ఉగాది మరియు రంజాన్ పండుగల నేపథ్యంలో శాంతి భద్రతల దృష్ట్యా ముందస్తుగా జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ప్రజలు కూడా పోలీసులకు సహకరించి, అనుమానాస్పద వ్యక్తులు లేదా వస్తువులు కనిపించినప్పుడు వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరారు. పండుగల సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీస్ శాఖ నిరంతరం అప్రమత్తంగా విధులు నిర్వహిస్తుందని తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *