Breaking News

క్రమశిక్షణతోనే పోలీసులకు గుర్తింపు: వికారాబాద్ ఎస్పీ స్నేహ మెహ్రా

వికారాబాద్: జిల్లా పరేడ్ మైదానంలో శనివారం నిర్వహించిన వారాంతపు పరేడ్‌ను జిల్లా ఎస్పీ Sneha Mehra పరిశీలించి సిబ్బంది నుంచి గౌరవ వందనం స్వీకరించారు.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, నిరంతర పరేడ్‌ల ద్వారా పోలీసు సిబ్బందిలో క్రమశిక్షణ, సమయపాలనతో పాటు పరస్పర సమన్వయం మరింత మెరుగుపడుతుందని తెలిపారు. విధి నిర్వహణలో ఎదురయ్యే ఒత్తిడిని అధిగమించేందుకు ప్రతి ఒక్కరూ ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు.

క్రమం తప్పకుండా వ్యాయామం చేస్తూ శారీరక, మానసిక దృఢత్వాన్ని పెంపొందించుకోవాలని, అంకితభావంతో విధులు నిర్వహించి జిల్లా పోలీసు శాఖకు మంచి పేరు తీసుకురావాలని పిలుపునిచ్చారు.

“ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక”లో భాగంగా ‘అరైవ్ అలైవ్’ రోడ్డు భద్రత కార్యక్రమం

ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ బి. రాములు నాయక్, ఏఆర్ డీఎస్పీ వీరేశ్, ఆర్‌ఐలు, ఎస్‌ఐలు మరియు ఇతర సిబ్బంది పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *