Breaking News

నల్గొండలో పోగొట్టుకున్న 60 మొబైల్ ఫోన్లు రికవరీ

బాధితులకు స్వయంగా అందజేసిన అదనపు ఎస్పీ జి. రమేష్

నల్గొండ: నేటి ఆధునిక కాలంలో మొబైల్ ఫోన్ కేవలం సమాచార సాధనం మాత్రమే కాకుండా వ్యక్తిగత సమాచారం, బ్యాంకింగ్ లావాదేవీలు మరియు ముఖ్యమైన డేటాను కలిగి ఉండే కీలక పరికరమని నల్గొండ అదనపు ఎస్పీ జి. రమేష్ పేర్కొన్నారు.

నల్గొండ వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో వివిధ సందర్భాల్లో పోగొట్టుకున్న మరియు దొంగతనానికి గురైన సుమారు 60 మొబైల్ ఫోన్లను పోలీసులు సాంకేతిక పరిజ్ఞానం సహాయంతో విజయవంతంగా రికవరీ చేశారు. CEIR (Central Equipment Identity Register) పోర్టల్ మరియు IMEI ట్రాకింగ్ విధానాల ద్వారా ఈ ఫోన్లను గుర్తించారు.

వన్ టౌన్ పోలీస్ సిబ్బంది కె. సత్యనారాయణ మరియు ఐటి కోర్ టీం సమన్వయంతో దేశంలోని వివిధ ప్రాంతాల నుండి ఫోన్లను ట్రేస్ చేసి స్వాధీనం చేసుకున్నారు. రికవరీ చేసిన ఫోన్లను అదనపు ఎస్పీ జి. రమేష్ స్వయంగా పరిశీలించి, వాటి అసలు యజమానులకు అందజేశారు. తమ ఫోన్లను తిరిగి పొందిన బాధితులు పోలీసు శాఖకు కృతజ్ఞతలు తెలిపారు.

ఇంటర్ మీడియట్ పరీక్ష కేంద్రాల వద్ద పటిష్ట బందోబస్తు ఏర్పాట్లు..

ఈ సందర్భంగా అదనపు ఎస్పీ మాట్లాడుతూ, మొబైల్ ఫోన్ పోగొట్టుకున్న వెంటనే ఆందోళన చెందకుండా సమీప పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయాలని సూచించారు. అలాగే ప్రభుత్వం ప్రవేశపెట్టిన CEIR పోర్టల్‌లో వివరాలను నమోదు చేయడం ద్వారా ఫోన్‌ను బ్లాక్ చేయడంతో పాటు దాని దుర్వినియోగాన్ని నివారించవచ్చని తెలిపారు.

అపరిచిత వ్యక్తుల నుండి సెకండ్ హ్యాండ్ మొబైల్ ఫోన్లు కొనుగోలు చేసే సమయంలో బిల్లు, బాక్స్ వంటి వివరాలను తప్పనిసరిగా తనిఖీ చేయాలని సూచించారు. మొబైల్ ఫోన్లలో ఉన్న వ్యక్తిగత ఫోటోలు, బ్యాంకింగ్ వివరాలు వంటి సమాచారంపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు.

ఈ కార్యక్రమంలో కె. శివరాం రెడ్డి, వన్ టౌన్ సీఐ రాజశేఖర్ రెడ్డి, ఎస్ఐలు గోపాల్ రావు, వెంకట నారాయణ మరియు ఇతర పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *