జిల్లాలో సిరిసిల్ల, వేములవాడ మున్సిపాలిటీలలో నిర్వహిస్తున్న ఎన్నికలు ప్రశాంతంగా, కొనసాగుతున్నట్లు జిల్లా ఎస్పీ మహేష్ బి. గితే తెలిపారు.
ఎన్నికల నిర్వహణలో భాగంగా సిరిసిల్ల,వేములవాడ మున్సిపాలిటిల పరిధిలో ఏర్పాటు చేసిన పలు పోలింగ్ కేంద్రాలను ఎస్పీ సందర్శించి,అక్కడి పరిస్థితులను ప్రత్యక్షంగా క్షేత్రస్థాయిలో పరిశీలించారు.

ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు ఎంతో విలువైనదని, ప్రతి ఓటరు ఎలాంటి భయభ్రాంతులు లేకుండా, స్వేచ్ఛగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని సూచించారు. జిల్లాలో ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. పెట్రోలింగ్ వాహనాలు మరియు ప్రత్యేక పోలీసు బృందాలు నిరంతరం పర్యటిస్తూ శాంతిభద్రతలను పర్యవేక్షిస్తారని తెలిపారు. పోలింగ్ కేంద్రాల వద్ద విధులు నిర్వహిస్తున్న అధికారుల కు మరియు సిబ్బందికి ఎస్పీ భద్రత పరమైన పలు సూచనలు చేశారు. ఏవైనా అనుమానాస్పద పరిస్థితులు ఎదురైతే వెంటనే పై అధికారుల దృష్టికి తీసుకురావాలని సూచనలు చేశారు.
