మహబూబాబాద్ జిల్లా ఎస్పీ డా. శబరీష్ ఆదేశాల మేరకు మహబూబాబాద్ షీ టీం ఎస్ఐ సునంద షీ టీం సభ్యులతో కలిసి తెలంగాణ రెసిడెన్షియల్ జూనియర్ కాలేజ్ మహబూబాబాద్ నందు షీ టీం, భరోసా, ఏ హెచ్ టి యు సైబర్ క్రైమ్, ర్యాగింగ్,ఈవ్ టీజింగ్, స్ట్రీట్ హరాష్మెంట్ గురించి అవగాహన సదస్సు నిర్వహించినారు.
షీ టీం సేవలు వాటి ఉద్దేశాన్ని వివరిస్తూ ఎప్పుడూ అందుబాటులో ఉండే డయల్ 112 or 100 లేదా మహబూబాబాద్ షీ టీం నెంబర్ 8712656935 నంబర్లను ప్రతి ఒక్కరు గుర్తుంచుకోవాలని సూచించారు.
సోషల్ మీడియాలో( ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, వాట్సప్) గుర్తుతెలియని వ్యక్తులతో స్నేహం చేయడం,వ్యక్తిగత వివరాలు, ఫోటోలు పంచుకోవడం వంటి వాటితో అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. ఆన్లైన్ వేధింపులు గురైతే వెంటనే సైబర్ క్రైమ్ హెల్ప్ లైన్ నెంబర్ 1930 కి లేదా సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేయాలని సూచించారు.
టీ- సేప్ యాప్ ; విద్యార్థులు మహిళల భద్రత కోసం టీ సెప్ యాప్ ను మొబైల్లో డౌన్లోడ్ చేసుకుని అత్యవసర పరిస్థితుల్లో దాన్ని ఉపయోగించే విధానం, మైనర్ డ్రైవింగ్ ,ట్రాఫిక్ నిబంధనల గురించి గురించి భరోసా సెంటర్ సేవలు, లైంగిక వేధింపులు, POCSO ACT గురించి, మానవ అక్రమ రవాణా గురించి వివరించారు.
ఈ కార్యక్రమంలో తెలంగాణ మైనార్టీ రెసిడెన్షియల్ జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ ఎండి. రహీం హుస్సేన్ మరియు అధ్యాపక సిబ్బంది విద్యార్థులు,

షీ టీం సిబ్బంది హెడ్ కానిస్టేబుల్ సుధాకర్ మరియు సిబ్బంది అరుణ, పార్వతి, రమేష్,
భరోసా సిబ్బంది జ్యోత్స్న ,రేణుక, ఏ హెచ్ టి యు ఉమెన్ కానిస్టేబుల్ సుప్రజ తదితరులు పాల్గొన్నారు.
