Breaking News

మున్సిపల్ ఎన్నికలపై పకడ్బందీగా నిఘా.

మున్సిపల్ ఎన్నికలపై పకడ్బందీగా నిఘా.

అసాంఘిక కార్యకలాపాలపై ప్రత్యేక దృష్టి.

ఓటర్లను ప్రలోభాలకు గురి చేస్తే కేసులు తప్పవు.

స్వేచ్ఛాయుత వాతావరణంలో ప్రజలు ఓటు హక్కును వినియోగించుకోవాలి.

మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో పకడ్బందీ భద్రత ఏర్పాట్లు.

ప్రచార గడువు ముగిసిన తర్వాత ఎటువంటి ర్యాలీలు, సభలు, ప్రచార కార్యక్రమాలు నిర్వహించరాదు.

సిరిసిల్ల డి.ఎస్.పి నాగేంద్రచారి..

స్వేచ్ఛాయుత, నిష్పక్షపాత ఎన్నికల కోసం సిరిసిల్ల పట్టణ కేంద్రంలో ఫ్లాగ్ మార్చ్

మున్సిపల్ ఎన్నికల సందర్భంగా ప్రజలు భయభ్రాంతులకు లోను కాకుండా,స్వేచ్ఛాయుత వాతావరణంలో తమ ఓటు హక్కును వినియోగించుకునేలా పోలీసు యంత్రాంగం పకడ్బందీగా భద్రతా ఏర్పాట్లు చేసినట్లు సిరిసిల్ల డిఎస్పీ నాగేంద్రచారి తెలిపారు.

ఎన్నికల ప్రక్రియ పారదర్శకంగా, శాంతియుత వాతావరణంలో జరిగేందకు చెక్‌పోస్టులు, వీడియో సర్వైలెన్స్ బృందాలు ఏర్పాటు చేసి నిరంతరం పర్యవేక్షణ కొనసాగిస్తున్నామని చెప్పారు.

ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించేందుకు అక్రమ మద్యం కట్టడిపై ప్రత్యేక దృష్టి సారించామని, ఓటర్లను ప్రలోభాలకు గురి చేసే వారిపై పోలీస్ నిఘా నిరంతరం ఉంటుందని తెలిపారు.

ఎవరైనా ఓటర్లను భయబ్రాంతులకు గురి చేసేలా వ్యవహరించినా, డబ్బు, మద్యం లేదా ఇతర ప్రలోభాలకు పాల్పడినా కఠిన చర్యలు తీసుకుంటూ కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు.

సోమవారం 5 గంటలకు ఎన్నికల ప్రచారం ముగుస్తున్న నేపథ్యంలో ఎన్నికల ప్రవర్తన నియమావళిని నిక్కచ్చిగా అమలు చేస్తున్నామని తెలిపారు.ప్రచార గడువు ముగిసిన తర్వాత ఎటువంటి ర్యాలీలు, సభలు, ప్రచార కార్యక్రమాలు నిర్వహించరాదని స్పష్టం చేశారు. ప్రజలు ఎన్నికల నియమావళిని గౌరవించి శాంతియుత ఎన్నికలకు సహకరించాలని కోరారు.

ప్రచారానికి బయటి నుంచి వచ్చిన వ్యక్తులు సోమవారం సాయంత్రం ఐదు గంటలలోపు సిరిసిల్ల మున్సిపల్ పరిధిని ఖాళీ చేసి వెళ్లాల్సిందిగా ఆదేశిస్తున్నాం.
సిరిసిల్ల ఓటర్లు ఉత్సాహంగా ముందుగానే పోలింగ్ స్టేషన్ చేరుకొని వాళ్ళ ఓటు హక్కు వినియోగించుకోవాల్సిందిగా కోరుతున్నాం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *