Breaking News

కుకట్‌పల్లి మేరినా స్కైస్ అపార్ట్‌మెంట్‌లో హైడ్రామా..

☑️ కుకట్‌పల్లి మేరినా స్కైస్ అపార్ట్‌మెంట్‌లో హైడ్రామా

ఐ.వి. సుభారావు, కూకట్‌పల్లి సీఐ
కుకట్‌పల్లి, నవభూమి ప్రతినిధి:
తాము పోలీసులమని చెప్పుకుని డబ్బులు వసూలు చేసిన ఘటన కుకట్‌పల్లి మేరినా స్కైస్ అపార్ట్‌మెంట్‌లో చోటు చేసుకుంది. సుమారు రూ.3 కోట్ల డిమాండ్ చేసి బాధితుడిని బెదిరించిన ఘటన వెలుగులోకి వచ్చింది.
నకిలీ పోలీసులుగా నటించిన కొందరు వ్యక్తులు అపార్ట్‌మెంట్‌లోకి ప్రవేశించి హైడ్రామా సృష్టించారు. బాధితుడిని బెదిరిస్తూ కేసులు పెడతామని, డబ్బులు ఇవ్వకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు.
ఈ ఘటనపై సమాచారం అందుకున్న కుకట్‌పల్లి పోలీసులు వెంటనే అపార్ట్‌మెంట్‌కు చేరుకుని దర్యాప్తు చేపట్టారు. ఘటనలో పాల్గొన్న ఇద్దరిని అరెస్ట్ చేయగా, మరో ముగ్గురు పరారీలో ఉన్నారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, నిందితులు నకిలీ పోలీస్ ఐడీలు ఉపయోగించి బాధితుడిని భయపెట్టారు. బాధితుడి వ్యాపార లావాదేవీలపై సమాచారం సేకరించి బెదిరింపులకు పాల్పడ్డారు.
ఈ కేసుపై పూర్తి స్థాయి విచారణ కొనసాగుతోందని, పరారీలో ఉన్న నిందితులను త్వరలోనే పట్టుకుంటామని పోలీసులు తెలిపారు.

నల్గొండలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురి హత్య కేసు ఛేదన.. నలుగురు అరెస్ట్, రూ.30 లక్షల నగదు సహా కీలక స్వాధీనం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *