బ్రైండోవర్ ధరతులు ఉల్లంఘిస్తే జైలుకేరాడీ షీట్లకు బాలానగర్ ఏసీపీ హెచ్చరిక
బాలానగర్ (డివిజన్), డిసెంబర్ (న్యూస్ పేజ్):
శాంతి భద్రతల పరిరక్షణకు పోలీసు శాఖ చర్యలు మరింత కఠినం చేసింది. రౌడీ షీటర్లపై ప్రత్యేక దృష్టి సారించి, చట్ట విరుద్ధ కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని బాలానగర్ ఏసీపీ హెచ్చరించారు.
ఈ సందర్భంగా ఏసీపీ మాట్లాడుతూ, అడ్డదిడ్డంగా ప్రవర్తించే రౌడీ షీటర్లను ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించబోమన్నారు. రౌడీ షీట్ ఉన్నవారు మంచి నడవడికతో జీవించాలని, లేకపోతే జైలుకు పంపక తప్పదని స్పష్టం చేశారు.
బాలానగర్ డివిజన్ పరిధిలోని సనత్నగర్, బాలానగర్ పోలీస్ స్టేషన్ల పరిధిలో ఉన్న రౌడీ షీటర్లతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో రౌడీ షీటర్లకు స్పష్టమైన హెచ్చరికలు జారీ చేశారు.
సమాజంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగించేలా ప్రవర్తిస్తే చట్టపరమైన చర్యలు తప్పవని తెలిపారు. యువత చెడు మార్గాలకు వెళ్లకుండా కుటుంబ సభ్యులు కూడా బాధ్యత వహించాలని సూచించారు.
పోలీస్ అధికారులు, సిబ్బంది ఈ సమావేశంలో పాల్గొన్నారు.
