• సిగాచి పరిశ్రమ మేనేజింగ్ డైరెక్టర్ & చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ – అమిత్ రాజ్ సిన్హా అరెస్ట్ జుడీషియాల రిమాండుకు తరలింపు..
• సిగాచి పరిశ్రమ మేనేజింగ్ డైరెక్టర్ & చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ – అమిత్ రాజ్ సిన్హా అరెస్ట్ జుడీషియాల రిమాండుకు తరలింపు..• వివరాలు వెల్లడించిన జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ ఐపిఎస్..
సంగారెడ్డి జిల్లా సురక్ష ప్రతినిధి: పాశమైలారం పారిశ్రమిక వాడలోని, సిగాచి పరిశ్రమలో సంభవించిన అగ్ని ప్రమాదం ఘటనపై భానూర్ పోలీస్ స్టేషన్లో క్రైమ్ నెం.184/2025, BNS సెక్షన్లు 105, 110, 118(1), 118(2) ప్రకారం కేసు నమోదు చేయడం జరిగింది..
ఇన్వెస్టిగేషన్ లో భాగంగా నిందితుడైన సిగాచి పరిశ్రమ మేనేజింగ్ డైరెక్టర్ & చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ – అమిత్ రాజ్ సిన్హా ను నిన్న తేది: 27.12.2025 సాయంత్రం అరెస్ట్ చేసి, జుడీషియల్ రిమాండుకు తరలించడం జరిగింది.
అరెస్ట్ అనంతరం గౌరవ న్యాయస్థానం నిందితుడిని 14 రోజుల జుడీషియల్ రిమాండుకు (Judicial Custody) ఆదేశించడం జరిగింది. ఈ కేసుకు సంబంధించి దర్యాప్తు ఇంకా కొనసాగుతోందని ఎస్పీ గారు తెలియజేశారు.
