Breaking News

తుది విడత స్థానిక ఎన్నికలకు అన్ని రకాల భద్రత ఏర్పాట్లు పూర్తి..

• 1160 – మంది పోలీసు అధికారులు, సిబ్బందితో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాటు..జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ ఐపిఎస్..

సంగారెడ్డి జిల్లా మూడవ విడత స్థానిక ఎన్నికలలో భాగంగా సంగారెడ్డి జిల్లా, నారాయణఖేడ్ నియోజకవర్గంలోని 8-మండలాలలో 207-గ్రామ పంచాయితీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయని జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ తెలియజేశారు. ఎన్నికలను ప్రశాంత వాతారణంలో నిర్వహించేదుకు అన్నిరకాల భద్రత ఏర్పాట్లను చేయడం జరిగిందని, సమస్యాత్మక, సెన్సిటివ్, హైపర్ సెన్సిటివ్ పోలింగ్ కేంద్రాలను గుర్తించి, నిఘా కట్టుదిట్టం చేయడం జరిగిందన్నారు. జిల్లా ప్రజలు, వివిధ పార్టీలను చెందిన నాయకులు ఎన్నికల ప్రవర్తన నియమావళిని కచ్చితంగా పాటిస్తూ.. ఎలాంటి ప్రలోభాలకు లోను కాకుండా మీ ఓటు హక్కును వినియోగించకోవాలని ఎస్పీ సూచించారు.

సిబ్బందిని ఉద్దేశించి మాట్లాడుతూ.. ఎన్నికల విధులలో అప్రమత్తంగా ఉండి, ఏ చిన్న సమస్య తలెత్తినా వెంటనే సీనియర్ అధికారులకు సమాచారం అంధించాలే కానీ ఎలాంటి తొందరపాటు నిర్ణయాలను తీసుకోకూడదని అన్నారు. ఎన్నికలు ప్రశాంతంగా, పారదర్శకంగా జరిగేందుకు అన్ని శాఖలతో సమన్వయంతో పని చేయాలని అన్నారు. ఎన్నికల ప్రక్రియ పూర్తి అయిన తరువాత తిరిగి డీఆర్సీ సెంటర్ కు వచ్చే వరకు పోలింగ్ సిబ్బందికి, బ్యాలెక్ బాక్స్ లకు రక్షణను కల్పించాలని సిబ్బందికి సూచించడం జరిగింది.

నల్గొండలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురి హత్య కేసు ఛేదన.. నలుగురు అరెస్ట్, రూ.30 లక్షల నగదు సహా కీలక స్వాధీనం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *