స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో నామినేషన్ కేంద్రాలు, సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలపై జిల్లా ఎస్పీ డి.జానకి, ప్రత్యేక పరిశీలన

నవాబ్ పేట పోలీస్ స్టేషన్ పరిధిలో స్థానిక సంస్థల ఎన్నికలకు అనుసంధానంగా భద్రతా ఏర్పాట్లను బలపరిచే లక్ష్యంతో ఈ రోజు కారుకొండ, గురుంట, నవాబ్ పేట నామినేషన్ కేంద్రాలను జిల్లా ఎస్పీ డి.జానకి, ప్రత్యక్షంగా సందర్శించారు. నామినేషన్ కేంద్రాలలో జరుగుతున్న కార్యకలాపాలు, ప్రజల రాకపోకలు, అక్కడి భద్రతా పరిస్థితులను సమగ్రంగా పరిశీలించారు.

అదేవిధంగా పరిధిలో ఉన్న సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను కూడా పరిశీలించి, అక్కడి పరిసరాలను సమీక్షించి శాంతిభద్రతల పరంగా తీసుకోవాల్సిన పలు సూచనలను గుర్తించి సంబంధిత నవాబ్ పేట ఎస్ఐ విక్రమ్ కి తగిన ఆదేశాలు జారీ చేశారు.

ఎన్నికల సమయంలో ఎలాంటి ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడకుండా అవసరమైన అదనపు బందోబస్తు ఏర్పాటు చేయాలని కూడా సూచించారు. ప్రజలు భయభ్రాంతిలేకుండా తమ ఓటు హక్కును వినియోగించే వాతావరణం కల్పించడానికి పోలీసులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తున్నట్లు తెలిపారు.
