Breaking News

నామినేషన్ కేంద్రాలలో వద్ద పటిష్ట బందోబస్తు…

గ్రామ పంచాయితీ నామినేషన్ల కేంద్రాన్ని పరిశీలించిన జిల్లా యస్పి శరత్ చంద్ర పవార్ ఐపీఎస్

నామినేషన్ కేంద్రాలలో వద్ద పటిష్ట బందోబస్తు

మొదటి విడత సర్పంచ్ ఎన్నికల నామినేషన్ల సందర్భంగా కనగల్ మండలంలోని చర్ల గౌరారం గ్రామంలోని సర్పంచి ఎన్నికల అభ్యర్థుల నామినేషన్ కేంద్రాన్ని సందర్శించి నామినేషన్ నామినేషన్ల ప్రక్రియను అక్కడ అధికారులతో అడిగి తెలుసుకుని నామినేషన్ కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పటిష్ట పోలీసు బందోబస్తు ఏర్పాటు చేసినట్లు జిల్లా ఎస్పీ గారు తెలిపారు. నామినేషన్ కేంద్రాల వద్ద ఉన్న పోలీసు సిబ్బందికి ఎన్నికల నిబంధనల ప్రకారం 100 మీటర్ల పరిధి నిబంధనలను అమలు చేయాలని నామినేషన్ కేంద్రాల్లోకి అనుమతి లేకుండా వ్యక్తు లను పంపవద్దని, నామినేషన్ కేంద్ర అధికారి నిర్ణయాలను అమలు చేయాలని సూచనలు సలహాలు అందించారు.

నల్లగొండ జిల్లాలో ప్రశాంతంగా కొనసాగుతున్న మున్సిపాలిటీ ఎన్నికల ప్రక్రియ..

ఈ కార్యక్రమంలో నల్గొండ డీఎస్పీ శివరాం రెడ్డి, చండూర్ సీఐ ఆదిరెడ్డి, కనగల్ ఎస్సై రాజిరెడ్డి, సిబ్బంది, తదితరులున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *