Breaking News

సైబర్ నేరాల పట్ల ప్రతి ఒక్కరు జాగ్రత్తగా ఉండాలి

నల్లగొండ పట్టణ కేంద్రంలోని లిటిల్ ఫ్లవర్ పాఠశాల నందు సైబర్ క్రైమ్ డి.ఎస్.పి లక్ష్మీనారాయణ, నల్లగొండ I-టౌన్ సిఐ రాజశేఖర్ రెడ్డి తో కలిసి సైబర్ నేరాల పట్ల విద్యార్థులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యక్రమంలో దాదాపు 400 మంది విద్యార్థులు పాల్గొన్నారు.

ఈ కార్యక్రమంలో డియస్పి గారు మాట్లాడుతూ విద్యార్థులకు వివిధ రకాల సైబర్ మోసాల గురించి వివరించారు.
ముఖ్యంగా విద్యార్థులు

సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల వద్ద పటిష్ట భద్రత ఏర్పాటు..
  • APK ఫైల్ మోసాలు
  • డిజిటల్ అరెస్ట్ స్కాములు
  • ఇన్వెస్ట్‌మెంట్ ఫ్రాడ్‌లు
  • OTP/UPI సంబంధిత మోసాలు
  • ఆన్‌లైన్ సోషల్ ఇంజినీరింగ్ ట్రాప్స్ పట్ల జాగ్రత్తగా ఉండాలని అన్నారు.
    అలాగే సురక్షితమైన ఇంటర్నెట్ వినియోగం, మోసాలు ఎదురైనప్పుడు ఎక్కడ ఎలా నివేదించాలి, వ్యక్తిగత సమాచారం రక్షణ వంటి అంశాలపై కూడా విద్యార్థులకు మార్గదర్శకత్వం అందించారు. విద్యార్థులకు ఎలాంటి అనుమానాస్పద లింకులు, యాప్స్, మెసేజ్‌లను ఓపెన్ చేయకుండా అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో 1టౌన్ సిఐ రాజశేఖర్ రెడ్డి, యస్.ఐ గోపాల్ రావు,సైబర్ క్రైమ్ యస్.ఐ విష్ణు,సిబ్బంది మరియు విద్యార్థినీ విద్యార్థులు  పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *