- -మాదక ద్రవ్యాల రహిత సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలి..జిల్లా ఎస్పీ నషాముక్త్ భారత్ అభియాన్ కార్యక్రమం ఐదేళ్లు పూర్తి చేసుకున్న సందర్బంగా జిల్లా వ్యాప్తంగా మాదక ద్రవ్యాల నిర్మూలనపై విద్యార్థినీ, విద్యార్థులకు అవగాహన కార్యక్రమాలు …
నషా ముక్త్ భారత్ అభియాన్ ఐదేళ్లు పూర్తి చేసుకున్న సందర్బంగా జిల్లా యస్పి శరత్ చంద్ర పవార్ ఐపీయస్ గారి సూచనల మేరకు పోలీస్ శాఖ ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలలో మత్తు రహిత సమాజ నిర్మాణం కొరకు అన్ని విద్యాసంస్థల్లో మాదకద్రవ్యాల వినియోగంపై వల్ల జరిగే నష్టాలు, పరిణామాలు,వాటి బారిన పడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు, చట్టపరమైన చర్యలపై పెద్ద ఎత్తున విద్యార్థిని విద్యార్థులకు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తూ విద్యార్థులతో మాదక ద్రవ్యాల పై జరుగుతున్న పోరాటంలో క్రియశిలా భాగస్వామి అవుతానని, డ్రగ్స్ రహిత జీవనశైలిని అనుసరిస్తూ, నాతో పాటు ఏ ఒక్కరూ డ్రగ్స్ బారిన పడకుండా ఉండడానికి కృషి చేస్తానని, డ్రగ్స్ అమ్మకం, కొనుగోలు, మరియు అక్రమ రవాణా చేసే వ్యక్తుల సమాచారాన్ని సంబంధిత అధికారులకు తెలియజేస్తాను అని డ్రగ్స్ రహిత సమాజమే లక్ష్యంగా సాగుతున్న తెలంగాణ ప్రభుత్వ సంకల్పంలో భాగస్వామిని అవుతానని ప్రతిజ్ఞ లు చేయడం జరిగి

ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ మత్తుపదార్థాల వల్ల యువత భవిష్యత్తు ప్రమాదంలో పడుతుందని, యువతలో మత్తు నిరోధక సంకల్పాన్ని పెంపొందించేందుకు ఇది ఒక మహత్తర యజ్ఞం అని పేర్కొన్నారు. జిల్లా పోలీస్ శాఖ తరపున అనేక అవగాహన కార్యక్రమాలు, కౌన్సిలింగ్ లు, చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని అన్నారు. సమాజంలో మత్తు రహిత వాతావరణం నెలకొల్పడంలో ప్రతి విద్యార్థి, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు సురకైన,పాత్ర పోషించాలని జిల్లా ఎస్పీ సూచించారు.
