• ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రజావాణి / గ్రీవెన్స్ డే కార్యక్రమం
• ఫిర్యాదుదారుల నుండి ప్రత్యక్షంగా ఫిర్యాదులను స్వీకరించిన జిల్లా ఎస్పీ
• సమస్యల సత్వర పరిష్కారం కోసం సంబంధిత ఎస్ హెచ్ ఓలకు ఫోన్ ద్వారా సూచనలు
:జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్, ఐపిఎస్
జిల్లా ప్రజల సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకునేందుకు, ఈ రోజు 17.11.2025 (సోమవారం) జిల్లా పోలీసు కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణి / గ్రీవెన్స్ డే కార్యక్రమంలో జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్, ఐపిఎస్ ప్రజల నుండి ఫిర్యాదులను స్వీకరించారు.
ఫిర్యాదుదారుల సమస్యలను ఓపికగా విని, సమస్యలు తలెత్తడానికి గల కారణాలపై సంబంధిత ఎస్హెచ్ఓ లతో ప్రత్యక్షంగా ఫోన్ ద్వారా మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. చట్టాన్ని అమలు చేయడంలో ఎటువంటి అలసత్వం ప్రదర్శించకూడదని, ప్రతి కేసును పారదర్శకంగా దర్యాప్తు చేయాలని సూచించారు. సివిల్ తగాదాల్లో పోలీసు అధికారులు జోక్యం చేసుకోకూడదని స్పష్టం చేశారు.
జిల్లా ప్రజలు తమ సమస్యలకు స్థానిక పోలీస్ స్టేషన్లో పరిష్కారం దొరకనప్పుడు, మూడవ వ్యక్తి ప్రమేయం లేకుండా నేరుగా జిల్లా పోలీసు కార్యాలయ సేవలను వినియోగించుకోవాలని ఎస్పీ సూచించారు. ప్రజావాణి కార్యక్రమం ద్వారా వచ్చిన ప్రతి ఫిర్యాదు పురోగతిని నిరంతరం సమీక్షిస్తూ, ప్రజల సమస్యల సత్వర పరిష్కారానికి కృషి చేయడం జరుగుతుందని జిల్లా ఎస్పీ తెలిపారు.జిల్లా ప్రజల సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకునేందుకు, ఈ రోజు 17.11.2025 (సోమవారం) జిల్లా పోలీసు కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణి / గ్రీవెన్స్ డే కార్యక్రమంలో జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్, ఐపిఎస్ ప్రజల నుండి ఫిర్యాదులను స్వీకరించారు.
ఫిర్యాదుదారుల సమస్యలను ఓపికగా విని, సమస్యలు తలెత్తడానికి గల కారణాలపై సంబంధిత ఎస్హెచ్ఓ లతో ప్రత్యక్షంగా ఫోన్ ద్వారా మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. చట్టాన్ని అమలు చేయడంలో ఎటువంటి అలసత్వం ప్రదర్శించకూడదని, ప్రతి కేసును పారదర్శకంగా దర్యాప్తు చేయాలని సూచించారు. సివిల్ తగాదాల్లో పోలీసు అధికారులు జోక్యం చేసుకోకూడదని స్పష్టం చేశారు.

జిల్లా ప్రజలు తమ సమస్యలకు స్థానిక పోలీస్ స్టేషన్లో పరిష్కారం దొరకనప్పుడు, మూడవ వ్యక్తి ప్రమేయం లేకుండా నేరుగా జిల్లా పోలీసు కార్యాలయ సేవలను వినియోగించుకోవాలని ఎస్పీ సూచించారు. ప్రజావాణి కార్యక్రమం ద్వారా వచ్చిన ప్రతి ఫిర్యాదు పురోగతిని నిరంతరం సమీక్షిస్తూ, ప్రజల సమస్యల సత్వర పరిష్కారానికి కృషి చేయడం జరుగుతుందని జిల్లా ఎస్పీ తెలిపారు.

