Breaking News

వందే మాతరం గీతం భారతదేశ స్వాతంత్ర్య ఉద్యమానికి స్ఫూర్తిదాయకమైన జాతీయ గీతం.

• వందే మాతరం జాతీయ గీతం 150 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా సిబ్బందితో కలిసి వందేమాతర గీతాన్ని ఆలపించిన జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ ఐపిఎస్.
వందే మాతరం జాతీయ గీతం 150 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా సంవత్సరం పొడువున అనగా 2025 నవంబర్ 7 నుండి 2026 నవంబర్ 7 వరకు స్మారక కార్యక్రమాల ద్వారా వందేమాతరం 150-వసంతాల ఉత్సవాలను జరుపుకోవాలని కేంద్రప్రభుత్వం నిర్ణయించిందని అన్నారు. ఇందులో భాగంగానే ఉదయం 10.00 గంటలకు జిల్లా పోలీసు కార్యాలయంలో సిబ్బందితో కలిసి వందేమాతరం జాతీయ గీతం ఆలపించడం జరిగిందని అన్నారు. వందేమాతర గీతాన్ని బంకిమ్ చంద్ర చటర్జీ 1875లో రాశారు. “వందే మాతరం” అంటే “మాతృభూమికి వందనం”, అని అర్థం. “వందే మాతరం” నినాదం బ్రిటిష్ పాలనకు వ్యతిరేక పోరాటంలో ఒక స్ఫూర్తి నినాదంగా నిలిచింది. 1905లో బెంగాల్ విభజన సమయంలో ప్రజలు ఈ నినాదాన్ని పాడుతూ బ్రిటిష్ వ్యతిరేక ఆందోళనలు చేశారు. బాల గంగాధర తిలక్, లాలా లజపతరాయ్, అరవిందఘోష్, బిపిన్ చంద్ర పాల్ వంటి నేతలు ఈ గీతాన్ని ప్రజల్లో తీసుకెళ్లారు. స్వాతంత్ర్య అనంతరం 24 జనవరి 1950 లో భారత రాజ్యాంగ సభ “వందే మాతరం” ను జాతీయ గీతంగా గుర్తించిందన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ రఘునందన్ రావ్, ఎఆర్ డిఎస్పీ నరేందర్, ఇన్స్పెక్టర్స్ రమేష్, కిరణ్ కుమార్, నాగేశ్వర్ రావ్, ఆర్ఐ లు రామారావ్, రాజశేఖర్ రెడ్డి, డానియెల్, శ్రీనివాస్ రావ్, ఆఫీసు సూపరిడెంట్స్ అశోక్, మెహనప్ప, డీపీఓ సిబ్బంది తదితరులు ఉన్నారు.

మహిళల భద్రతే లక్ష్యం: షీ టీమ్స్ సిబ్బందికి రిఫ్రెషర్ కోర్స్ శిక్షణ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *