
• రికార్డ్స్ మెంటేనేన్స్, కేసుల దర్యాప్తు లో ఎస్.హెచ్.ఓ లకు సూచనలు, మరియు సాంకేతిక వినియోగంపై సిబ్బందికి శిక్షణ తరగతులు నిర్వహించాలి.
• క్రైమ్ రికార్డ్స్ బ్రాంచ్ అధికారులు, సిబ్బంది పని తీరు బాగుంది జిల్లా ఎస్పి.
వార్షిక తనిఖీలలో భాగంగా జిల్లా క్రైమ్ రికార్డ్స్ బ్రాంచ్ ను సందర్శించిన జిల్లా ఎస్పి పరితోష్ పంకజ్ ఐపిఎస్ కి డీసీఆర్బీ డిఎస్పీ సురేందర్ రెడ్డి పుష్ప గుచ్చాన్ని అందజేశారు. అనంతరం డీసీఆర్బీ కార్యాలయాన్ని పర్యాయవేక్షిస్తూ.రికార్డ్ లను తనిఖీ చేశారు. జిల్లాలో నమోదైన ప్రతికేసును ఎప్పటికప్పుడు రికార్డ్ లో అప్డేట్ చేస్తూ, ఇన్వెస్టిగేషన్ లో ఎస్.హెచ్.ఓ లకు తగిన సలహాలు సూచనలు అందించాలని అన్నారు. అవసరాన్ని బట్టి వివిధ కేసులల్లో అడ్వయిజరీ మెమోలను ఇస్తూ.నాణ్యమైయన ఇన్వెస్టిగేషన్ చేసేవిధంగా చూడాలని అన్నారు. జిల్లాలో వివిధ స్టేషన్ లలో విధులు నిర్వహిస్తున్న సిబ్బందికి సాంకేతిక పరిజ్ఞానాన్ని పెంపొందిచే విధంగా శిక్షణ తరగతులను నిర్వహించాలని, జిల్లా వ్యాప్తంగా ఏ ప్రాంతాలలో ఏ విధమైన నేరాలు జరుగుతున్నాయని, అధిక నేరాలు జరుగుతున్న ప్రాంతాలను హాట్ స్పాట్ లుగా, అధిక రోడ్డు ప్రమాదాలు జరుగుతున్న ప్రాంతాలను బ్లాక్ స్పాట్ లుగా గుర్తించి, సంభందిత అధికారులకు తగిన సలహాలు సూచనలు అందించాలని సూచించడం జరిగింది. జిల్లాలో నేర చరిత్ర గల/ హిస్టరీ షీటర్ లపై ప్రత్యేక నిఘా ఉంచేలా ప్రత్యేక సలహాలు సూచనలు అందించాలని, వివిధ శాఖలతో సమన్వయం చేసుకుంటూ ఆపరేషన్ స్మైల్, ముస్కాన్ వంటి కార్యక్రమాలను విజయవంతంగా నిర్వహించాలని అన్నారు. జిల్లాలో క్రైమ్ నియంత్రణకు ఎస్ హెచ్ ఓ లకు తగు సలహాలు సూచనలు చేస్తూ నేరాల నియంత్రణలో డీసీఆర్బీ కీలక పాత్ర పోషించాలని అన్నారు. డీసీఆర్బీ రికార్డుల మెయింటనెన్స్, సిబ్బంది పని తీరు బాగుందని, ఉత్తమ ప్రతిభ కనబరిచిన సిబ్బందికి రివార్డ్లు ప్రకటిస్తూ డీసీఆర్బీ డిఎస్పీ సురేందర్ రెడ్డి, ఇన్స్పెక్టర్ రమేష్, ఎస్ఐ లను, సిబ్బందిని ఎస్పి అభినందించారు. ఈ తనిఖీ లలో భాగంగా ఎస్పి వెంబడి అదనపు ఎస్పీ రఘునందన్ రావ్ ఉన్నారు.

