Breaking News

రైల్వే బ్రిడ్జి అండర్ పాస్ వద్ద ట్రాఫిక్ జామ్ అవుతున్న ప్రదేశాన్ని పరిశీలించిన – జిల్లా ఎస్పీ.

జాతీయ రహదారి 65 పై వర్షం నీరు కారణంగా చిట్యాల రైల్వే బ్రిడ్జి అండర్ పాస్ వద్ద ట్రాఫిక్ జామ్ అవుతున్న ప్రదేశాన్ని పరిశీలించిన జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ ఐపీఎస్,గత కొన్ని రోజులుగా కురుసిన వర్షాల కారణంగా చిట్యాల రైల్వే బ్రిడ్జి అండర్ పాస్ వద్ద నీరు నిలవడంతో వాహనరాకపోకలకు ట్రాఫిక్ ఇబ్బంది కలగడంతో నేషనల్ హైవే,ఫైర్, రెవిన్యూ,మున్సిపాలిటీ తదితర సంబంధత అధికారులతో నీరు నిలవడానికి గల కారణాల పై సంబంధత అధికారులతో చర్చించి ట్రాఫిక్ జామ్ కాకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని, అక్కడ నీరు నిలవకుండా శాశ్వత ఏర్పాట్లు చేసేలా సంబంధిత అధికారులకు చూచించడం జరిగింది. ఈ కార్యక్రమంలో నల్లగొండ డిఎస్పీ శివరాం రెడ్డి,నార్కట్పల్లి సీఐ నాగరాజు,ట్రాఫిక్ సీఐ మహా లక్ష్మయ్య,వివిధ శాఖల అధికారులు ఉన్నారు.

మహిళల భద్రతే లక్ష్యం: షీ టీమ్స్ సిబ్బందికి రిఫ్రెషర్ కోర్స్ శిక్షణ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *