Breaking News

ముషీరాబాద్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని వివిధ ప్రాంతాలను సందర్శించిన-సెంట్రల్‌ జోన్‌ డీసీపీ.

కమ్యూనిటీ పోలీసింగ్‌ మరియు విజిబుల్‌ పోలీసింగ్‌ కార్యక్రమాల భాగంగా, సెంట్రల్‌ జోన్‌ డిప్యూటీ కమిషనర్‌ ఆఫ్‌ పోలీస్‌ శ్రీమతి కె.శిల్పావల్లి, ఐపీఎస్‌ ముషీరాబాద్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని వివిధ ప్రాంతాలను సందర్శించారు. ఈ సందర్శనలో ఏడీసీపీ ఆనంద్‌, ఏసీపీ చిక్కడపల్లి రమేష్‌, ఎస్‌హెచ్‌ఓ ముషీరాబాద్‌ రాంబాబు, డీఐ నదీం మరియు ఇతర పోలీస్‌ సిబ్బంది పాల్గొన్నారు. డీసీపీ బృందం భోళకపూర్‌, బోయిగూడా ప్రాంతాలలో ఫుట్‌ పెట్రోలింగ్‌ నిర్వహించి, స్థానిక నివాసులు, వ్యాపారులతో మాట్లాడారు. “నేను సైతం” సీసీటీవీ కెమెరాల పనితీరును పరిశీలించడంతో పాటు, వాణిజ్య స్థాపనల్లో భద్రతా చర్యలను తనిఖీ చేశారు. అలాగే, రౌడీ షీటర్ల వివరాలను పరిశీలించి, వారి ప్రస్తుత కార్యకలాపాలను సమీక్షించారు. ఈ పర్యటన సందర్భంగా డీసీపీ మరియు బృందం ముసలి వారు, మహిళలు, పిల్లలు తదితరులతో మాట్లాడి, వారి ప్రాంతాల్లో బ్లూ కోల్ట్స్‌ పెట్రోల్‌ కార్‌ సిబ్బంది మరియు సెక్టార్‌ ఎస్ఐలు క్రమం తప్పకుండా వస్తున్నారా అనే అంశాన్ని అడిగి తెలుసుకున్నారు. ప్రజల నుండి వచ్చిన అభిప్రాయాలను స్వీకరించి, ఎస్‌హెచ్‌ఓను ప్రజలు పేర్కొన్న సమస్యలను వెంటనే పరిష్కరించాల‌ని ఆదేశించారు. ప్రజలు తమ ప్రాంతంలో పోలీస్‌ అధికారులు, సిబ్బంది సమాజంతో సత్సంబంధాలు కొనసాగిస్తూ, నిరంతర పరస్పర చర్యలు చేపడుతున్నందుకు కృతజ్ఞతలు తెలిపారు. తర్వాత డీసీపీ జనప్రియ అపార్ట్‌మెంట్స్‌ ను సందర్శించి, నివాసులతో మాట్లాడి, వృద్ధుల భద్రత, సంక్షేమ కార్యక్రమాలు, అలాగే అపార్ట్‌మెంట్‌లలో తీసుకోవాల్సిన భద్రతా చర్యలపై సూచనలు ఇచ్చారు. హైదరాబాద్‌ నగర పోలీస్‌ కమిషనర్‌ వి.సీ. సజ్జనార్‌, ఐపీఎస్‌ ఆదేశాల మేరకు సెంట్రల్‌ జోన్‌లోని అందరు అధికారులు విజిబుల్‌ పోలీసింగ్‌ మరియు కమ్యూనిటీ అవుట్‌రీచ్‌ కార్యక్రమాలను బలోపేతం చేయడానికి ప్రజలతో నేరుగా కలసి మాట్లాడడం, అలాగే వాట్సాప్‌ కమ్యూనిటీ గ్రూపుల ద్వారా సమన్వయం పెంచుతున్నారని పేర్కొన్నారు.

మహిళల భద్రతే లక్ష్యం: షీ టీమ్స్ సిబ్బందికి రిఫ్రెషర్ కోర్స్ శిక్షణ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *