
పోలీసు విధుల్లో ప్రాణత్యాగం చేసిన ధైర్యవంతులైన పోలీసు సిబ్బందిని స్మరించుకుంటూ ప్రతి సంవత్సరం అక్టోబర్ 21న “పోలీస్ సంస్మరణ దినోత్సవం (Police Flag Day)”గా నిర్వహించబడుతుంది. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని తెలంగాణ రాష్ట్ర పోలీసు శాఖ ఆధ్వర్యంలో *ఆన్లైన్ వ్యాసరచన పోటీ (Essay Writing Competition)ని ఆంగ్లం / తెలుగు / ఉర్దూ భాషల్లో నిర్వహించబడుతుంది. 6వ తరగతి నుండి పీజీ (Post Graduation) వరకు చదువుతున్న విద్యార్థులు అందరూ ఈ పోటీలో పాల్గొనవచ్చు.
వ్యాసరచన విషయం: “మత్తు పదార్థాల సమస్య నిరోధించడంలో పోలీసు పాత్ర మరియు విద్యార్థులు మత్తు పదార్థాలకు దూరంగా ఉండే విధానం”
“DRUGS MENANCE: ROLE OF POLICE IN PREVENTION AND HOW STUDENTS CAN STAY AWAY FROM DRUGS.”.
- కింది లింక్పై క్లిక్ చేయండి:
👉 https://forms.gle/jaWLdt2yhNrMpe3eA - మీ పేరు, విద్య, ఇతర వివరాలు నమోదు చేయండి.
- వ్యాసం పేపర్పై రాసి, దాని ఫోటో లేదా PDF రూపంలో అప్లోడ్ చేయాలి (500 పదాలకు మించకుండా) మరియు సబ్మిట్ చేయాలి.
- వ్యాసం సమర్పణకు చివరి తేది: 31-10-2025.
జిల్లా స్థాయిలో ప్రతి భాష (తెలుగు, ఆంగ్లం, ఉర్దూ)లో మొదటి, రెండవ, మూడవ బహుమతి పొందిన విజేతలకు మెమెంటోలు / బహుమతులు అందజేయబడతాయి.
ఈ కార్యక్రమానికి స్థానికంగా ప్రసిద్ధులైన సీనియర్ నాయకులు, రిటైర్డ్ ప్రిన్సిపల్స్, హెడ్మాస్టర్స్, రచయితలు, కవులు, సామాజిక సేవకులు వంటి ప్రముఖులను ఆహ్వానించి బహుమతులు అందజేయబడతాయి. అలాగే, విజేతల వివరాలు మహబూబాబాద్ జిల్లా పోలీసు శాఖ అధికారిక సోషల్ మీడియా పేజీలలో ప్రచురించబడతాయి.
